NTV Telugu Site icon

Train Reverse : స్టేషన్ మర్చిపోయిన లోకో ఫైలట్.. ట్రైన్ రివర్స్ తిప్పేశాడు

Indian Railway,

Indian Railway,

Train Reverse : బస్సులు, కార్లు రివర్స్ వెల్లడం చూశాం కానీ.. రైలు రివర్స్ వెళ్తుందని చాలా కొద్దిమంది మాత్రమే వినుంటారు.కేరళలోని షోరనూర్ వెళ్తున్న వేనాడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదవశాత్తు స్టాప్ దాటింది. రైలు ఒక కిలోమీటరు ముందుకు వెళ్ళింది. అప్పుడు లోకో పైలట్‌కి ఒక్కసారిగా గుర్తుకొచ్చింది.లోకో పైలట్ అతను మునుపటి స్టేషన్‌లో ఆగవలసి ఉందని గమనించాడు. ఈ పొరపాటు కారణంగా రైలును వెనక్కి తిప్పాల్సి వచ్చింది. చేర్యానాడ్ రైల్వే స్టేషన్‌లో ఎలాంటి సిగ్నల్ లేదు. సిగ్నల్స్ బ్లాక్ స్టేషన్లలో అంటే పెద్ద స్టేషన్లలో మాత్రమే అమర్చబడతాయి. లోకో పైలట్ అది గమనించలేదు. దీంతో అక్కడ ఆగాలన్న విషయం మర్చిపోయాడు. దీంతో రైలు ఒక కిలోమీటరు ముందుకు వెళ్ళింది. అప్పుడే అకస్మాత్తుగా అతనికి గుర్తు వచ్చింది. తరువాత రైలును చేర్యానాడ్ రైల్వే స్టేషన్‌కు వెనుకకు తీసుకువెళ్లవలసి వచ్చింది. దీని కారణంగా.. రైలు షెడ్యూల్ 8 నిమిషాలు ఆలస్యమైంది. అయితే తరువాత లోకో పైలట్ ఈ ఆలస్యాన్ని కవర్ చేశాడు.

Read Also:Manipur: మణిపూర్‌లో మరోసారి హింస.. చర్చికి నిప్పుపెట్టిన దుండగులు

రైలు ఆలస్యం కావడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని రైల్వే తెలిపింది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కొంత మంది చేర్యానాడ్ స్టేషన్‌లోనే దిగాల్సి వచ్చింది. స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులు దిగి రైలు ఎక్కవచ్చు. రైలు కదలడంతో ప్రయాణికులు కూడా అయోమయంలో పడ్డారు. అనంతరం రైలు తిరిగి రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. లోకో పైలట్‌ నుంచి ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే తెలిపింది. అయితే చేర్యానాడ్ స్టేషన్‌కు రావాలంటే రైలు 700 మీటర్లు వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని రైల్వే స్పష్టం చేసింది.

Read Also:AP Governor Abdul Nazeer : 2030నాటికల్లా ఆహార భద్రత సాధించాలి : గవర్నర్ అబ్దుల్ నజీర్