మెగా డాటర్ నిహారిక హోస్టుగా చేస్తున్న ‘ఆహా’ కిచెన్ షో ‘చెఫ్ మంత్ర’. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ప్రస్తుతం మూడో సీజన్ రన్ అవుతోంది.ఇప్పటికే రెండు ఎపిసోడ్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షో మూడో ఎపిసోడ్ కు నటుడు నవదీప్ మరియు నటి తేజస్విని గెస్టులుగా వచ్చారు. వీరిద్దరు వారి అల్లరితో షోలో బాగా సందడి చేసారు.“ఫస్ట్ అయితే వస్తుంది సాలరీ, ఎవడ్రా ఆపేది మా తేజు అల్లరి.. సినిమాల్లో వేస్తారు బీప్, అంతకన్నా బ్యాడ్ బాయ్ మా నవదీపు” అంటూ నిహారిక ఎపిసోడ్ ను మొదలు పెడుతుంది. ఏదో కవిత్వం చెప్తాను అన్నావ్ అంటాడు నవదీప్. అవి ఇవే అని నిహారిక చెప్పడంతో.. ఓహో ఇదేనా అంటాడు. దీంతో షోలో అందరూ నవ్వుతారు. ఆ తర్వాత షోలో అడిగిన డబుల్ మీనింగ్ ప్రశ్నలు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.ఎవరితో మీకు డ్యాష్ చేయడం ఇష్టం? అని నవదీప్ అనడంతో తేజు నవ్వుతుంది. మీ డ్యాష్ ని ఎప్పుడైనా ఫోటో తీసి ఎవరికైనా పంపించారా? అని తేజస్వి అడుగుతుంది. వాళ్లే తీసుకుని వాళ్లే పంపించుకుంటే? అని నవదీప్ అనడంతో అందరూ నవ్వుతారు. ఎవరో ఈ రైటర్ బాగా కామాంధుడిలా ఉన్నాడు అంటాడు నవదీప్. ఎవరండీ ఇది కిచన్ షో అన్నది.. ఇది బెడ్రూం షోలా ఉంది అంటుంది తేజస్వి.
ఇక బెడ్రూంలో ఉండే ఐటెమ్స్ ఏంటి? అని నిహారిక అడుగుతుంది. సబ్బు అని చెప్తాడు నవదీప్. బెడ్ రూమ్ లో సబ్బు ఎందుకు ఉంటుంది? అని అడుగుతుంది తేజస్వి. నా బెడ్ రూమ్ లో ఏం ఉన్నాయో నీకెందుకు అంటాడు నవదీప్. ఆ తర్వాత ఓ ఆకును పట్టుకుని అదేంటో చెప్పాలని అడుగుతారు. ఆకు పట్టుకుని ఏ ఆకో చెప్పే మగాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా? అంటాడు నవదీప్. ఆ తర్వాత తేజస్వి తొక్క తీసిన అరటి పండును పట్టుకుని చాక్లెట్ క్లే అని చెప్తుంది. కాస్త నొక్కి చూడమని చెప్పడంతో అరటి పండు అని చెప్తుంది. ఆ తర్వాత ఓ చేతిలో కర్భూజ పండు, మరో చేతిలో బెలూన్ పెట్టి ఫన్నీ గేమ్ ఆడిస్తారు. అటు ఓ చిన్న డబ్బా ఓపెన్ చేయగానే దానిలో నుంచి పెద్ద పాములాంటి బొమ్మ బయటకు వస్తుంది. వెంటనే తేజు, నవదీప్ భయపడతారు. అనంతరం తేజు, నవదీప్ కలిసి ఓ చక్కటి వంటకాన్ని తయారు చేస్తారు. వారు వంట చేస్తున్న సమయంలో యాదమ్మ రాజు వచ్చి ఫుల్ కామెడీ చేస్తాడు.ఇలా మూడో ఎపిసోడ్ ప్రోమో డబుల్ మీనింగ్ ప్రశ్నలతో ఎంతో ఫన్నీగా సాగింది. ఈ ఎపిసోడ్ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది..