Vijayashanthi Reddy Case: చర్లపల్లి రైల్వే ట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసు మిస్టరీగా మారింది. 9 రోజులు గడుస్తున్న సూసైడ్ కేసులో సస్పెన్స్ కొనసాగుతుంది. వివిధ కోణాల్లో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు సూసైడ్ కఠిన నిర్ణయం ఎందుకు? తీసుకున్నారు. ఇంటర్ చదువుతున్న పిల్లలను ఆత్మహత్యకు తల్లి ఎలా ఒప్పించింది?, తల్లి ఆత్మహత్య చేసుకోవాలన్నా పిల్లలు ఎలా ఒప్పుకొన్నారు?, పిల్లలతో కలిసి తల్లి సూసైడ్ నిర్ణయం వెనుక అసలు కారణాలు?పై సర్వాత్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also: PM Modi: ఇరు దేశాలకు మంచి న్యూస్.. ట్రంప్నకు మోడీ కృతజ్ఞతలు
అయితే, ఎవరికీ చెప్పుకోలేని బాధలో విజయారెడ్డి ఉందా?, ఎన్నో సవాళ్లు పరిష్కరించగల సత్తా ఉన్న విజయశాంతి రెడ్డి పిల్లలతో కలిసి అంత పెద్ద కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది? అని ప్రశ్నలపై జీఆర్పీ పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే ఈ కేసు కొలిక్కి తీసుకొస్తామని పేర్కొన్నారు.
