Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. చంద్రుడి ఉపరితలంపై రోవర్ మళ్లీ యాక్టివ్గా మారుతుందన్నారు. కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోవర్ మళ్లీ యాక్టివ్గా మారుతుందా అని ఎస్ సోమనాథ్ను అడిగినప్పుడు దానికి పూర్తి అవకాశాలు ఉన్నాయని ఇస్రో చీఫ్ బదులిచ్చారు. చంద్రుడి ఉపరితలంపై రోవర్ ప్రస్తుతం స్లిప్ మోడ్లో ఉంది. అయితే అది మళ్లీ యాక్టివ్గా మారదని చెప్పలేమన్నారు. చంద్రుడి ఉపరితలంపై ప్రశాంతంగా నిద్రిస్తోందని తెలిపారు. బాగా నిద్రపోనివ్వండి..ప్రస్తుతానికి దానిని ఇబ్బంది పెట్టం. లేవాల్సి వచ్చినప్పుడు దానంతట అదే లేస్తుంది. అప్పటి వరకు దానిని డిస్టర్బ్ చేయమన్నారు.
Read Also:Crime News: నంద్యాలలో దారుణం.. కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి
చంద్రయాన్-3 మిషన్ లక్ష్యం నెరవేరిందని ఇస్రో చీఫ్ చెప్పారు. ఈ మిషన్ ద్వారా సేకరించిన శాస్త్రీయ సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మిషన్లో ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ స్వంత స్థాయిలో పనిని పూర్తి చేశారు. సెప్టెంబర్ 2న రోవర్ను స్లిప్ మోడ్లోకి పంపారు. విక్రమ్, రోవర్ని నిద్రపోయే ముందు పేలోడ్లు అన్నీ స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి. సెప్టెంబర్ 22 న, ఇస్రో తన చంద్ర మిషన్ చంద్రయాన్ -3 యొక్క ల్యాండర్ విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ తో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఇప్పటి వరకు దాని నుండి ఎటువంటి సిగ్నల్ అందలేదు. అంతకుముందు, ఆగస్టు 23న చంద్రునిపై దిగిన తర్వాత, ల్యాండర్, రోవర్, పేలోడ్ ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగాలు నిర్వహించాయి.
Read Also:Virat Kohli: మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డు బ్రేక్
చంద్రయాన్-3 ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఎందుకంటే చంద్రుని దక్షిణ ధృవాన్ని ఏ దేశమూ ఇంకా చేరుకోలేకపోయింది. ఇంతకు ముందు రష్యా, అమెరికా, చైనాలు చంద్రుడిపై కాలు మోపినప్పటికీ దక్షిణ ధృవం మీద అడుగు పెట్టలేకపోయాయి. చంద్రయాన్-3 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ 4 దశల్లో జరిగింది.