Chandrayaan-3: గుడ్ న్యూస్.. త్వరలో మళ్లీ యాక్టివ్ కానున్న ప్రజ్ఞాన్ రోవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. చంద్రుడి ఉపరితలంపై రోవర్ మళ్లీ యాక్టివ్గా మారుతుందన్నారు. కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోవర్ మళ్లీ యాక్టివ్గా మారుతుందా అని ఎస్ సోమనాథ్ను అడిగినప్పుడు దానికి పూర్తి అవకాశాలు ఉన్నాయని ఇస్రో చీఫ్ బదులిచ్చారు. చంద్రుడి ఉపరితలంపై రోవర్ ప్రస్తుతం స్లిప్ మోడ్లో ఉంది. అయితే అది మళ్లీ యాక్టివ్గా మారదని చెప్పలేమన్నారు. చంద్రుడి ఉపరితలంపై ప్రశాంతంగా నిద్రిస్తోందని తెలిపారు. బాగా నిద్రపోనివ్వండి..ప్రస్తుతానికి దానిని ఇబ్బంది పెట్టం. లేవాల్సి వచ్చినప్పుడు దానంతట అదే లేస్తుంది. అప్పటి వరకు దానిని డిస్టర్బ్ చేయమన్నారు.
Read Also:Crime News: నంద్యాలలో దారుణం.. కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి
Also Read
- 2027 World Cup: : పంత్, శాంసన్లకు నో ఛాన్స్.. అశ్విన్ ప్రకటించిన జట్టులో ఊహించని ట్విస్ట్..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
చంద్రయాన్-3 మిషన్ లక్ష్యం నెరవేరిందని ఇస్రో చీఫ్ చెప్పారు. ఈ మిషన్ ద్వారా సేకరించిన శాస్త్రీయ సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మిషన్లో ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ స్వంత స్థాయిలో పనిని పూర్తి చేశారు. సెప్టెంబర్ 2న రోవర్ను స్లిప్ మోడ్లోకి పంపారు. విక్రమ్, రోవర్ని నిద్రపోయే ముందు పేలోడ్లు అన్నీ స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి. సెప్టెంబర్ 22 న, ఇస్రో తన చంద్ర మిషన్ చంద్రయాన్ -3 యొక్క ల్యాండర్ విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ తో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఇప్పటి వరకు దాని నుండి ఎటువంటి సిగ్నల్ అందలేదు. అంతకుముందు, ఆగస్టు 23న చంద్రునిపై దిగిన తర్వాత, ల్యాండర్, రోవర్, పేలోడ్ ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగాలు నిర్వహించాయి.
Read Also:Virat Kohli: మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డు బ్రేక్
చంద్రయాన్-3 ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఎందుకంటే చంద్రుని దక్షిణ ధృవాన్ని ఏ దేశమూ ఇంకా చేరుకోలేకపోయింది. ఇంతకు ముందు రష్యా, అమెరికా, చైనాలు చంద్రుడిపై కాలు మోపినప్పటికీ దక్షిణ ధృవం మీద అడుగు పెట్టలేకపోయాయి. చంద్రయాన్-3 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ 4 దశల్లో జరిగింది.
తాజావార్తలు
-
2027 World Cup: : పంత్, శాంసన్లకు నో ఛాన్స్.. అశ్విన్ ప్రకటించిన జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!