Chandrayaan-3: గుడ్ న్యూస్.. త్వరలో మళ్లీ యాక్టివ్ కానున్న ప్రజ్ఞాన్ రోవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. చంద్రుడి ఉపరితలంపై రోవర్ మళ్లీ యాక్టివ్గా మారుతుందన్నారు. కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోవర్ మళ్లీ యాక్టివ్గా మారుతుందా అని ఎస్ సోమనాథ్ను అడిగినప్పుడు దానికి పూర్తి అవకాశాలు ఉన్నాయని ఇస్రో చీఫ్ బదులిచ్చారు. చంద్రుడి ఉపరితలంపై రోవర్ ప్రస్తుతం స్లిప్ మోడ్లో ఉంది. అయితే అది మళ్లీ యాక్టివ్గా మారదని చెప్పలేమన్నారు. చంద్రుడి ఉపరితలంపై ప్రశాంతంగా నిద్రిస్తోందని తెలిపారు. బాగా నిద్రపోనివ్వండి..ప్రస్తుతానికి దానిని ఇబ్బంది పెట్టం. లేవాల్సి వచ్చినప్పుడు దానంతట అదే లేస్తుంది. అప్పటి వరకు దానిని డిస్టర్బ్ చేయమన్నారు.
Read Also:Crime News: నంద్యాలలో దారుణం.. కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
చంద్రయాన్-3 మిషన్ లక్ష్యం నెరవేరిందని ఇస్రో చీఫ్ చెప్పారు. ఈ మిషన్ ద్వారా సేకరించిన శాస్త్రీయ సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మిషన్లో ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ స్వంత స్థాయిలో పనిని పూర్తి చేశారు. సెప్టెంబర్ 2న రోవర్ను స్లిప్ మోడ్లోకి పంపారు. విక్రమ్, రోవర్ని నిద్రపోయే ముందు పేలోడ్లు అన్నీ స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి. సెప్టెంబర్ 22 న, ఇస్రో తన చంద్ర మిషన్ చంద్రయాన్ -3 యొక్క ల్యాండర్ విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ తో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఇప్పటి వరకు దాని నుండి ఎటువంటి సిగ్నల్ అందలేదు. అంతకుముందు, ఆగస్టు 23న చంద్రునిపై దిగిన తర్వాత, ల్యాండర్, రోవర్, పేలోడ్ ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగాలు నిర్వహించాయి.
Read Also:Virat Kohli: మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డు బ్రేక్
చంద్రయాన్-3 ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఎందుకంటే చంద్రుని దక్షిణ ధృవాన్ని ఏ దేశమూ ఇంకా చేరుకోలేకపోయింది. ఇంతకు ముందు రష్యా, అమెరికా, చైనాలు చంద్రుడిపై కాలు మోపినప్పటికీ దక్షిణ ధృవం మీద అడుగు పెట్టలేకపోయాయి. చంద్రయాన్-3 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ 4 దశల్లో జరిగింది.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!