NTV Telugu Site icon

Viral News : పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.. ఇడ్లీలు అమ్ముకుంటున్న చంద్రయాన్ -3 టెక్నీషియన్

New Project (1)

New Project (1)

Chandrayaan-3: భారతదేశ చరిత్రలో 23 ఆగస్టు 2023 తేదీ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు. రాబోయే తరాలు ఈ తేదీని భారతదేశం శక్తిని గుర్తుంచుకుంటారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు చప్పట్లు కొట్టి భారత్ ను ప్రశంసించారు. ఈ రోజున భారతదేశం చంద్రుని దక్షిణ ధృవం (చంద్రయాన్-3)పై దిగాలనే తన సంవత్సరాల నాటి కలను సాకారం చేసుకుంది. హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (HEC)కి చెందిన కొంతమంది సాంకేతిక నిపుణులతో సహా చాలా మంది ఈ కలను నిజం చేసుకోవడానికి తమ జీవితాలను అంకితం చేశారు. వారిలో ఒకడు దీపక్ కుమార్ ఉప్రారియా. హెచ్ఈసీ సాంకేతిక నిపుణుడు. అతను ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించడానికి ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు. అతను జార్ఖండ్‌లోని రాంచీలోని ధూర్వా ప్రాంతంలో ఇడ్లీ దుకాణాన్ని ప్రారంభించాడు. చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్‌ను తయారు చేయడంలో దీపక్ సహకరించారు. అతడికి 18 నెలలుగా తన జీతం అందలేదు. అందుకే కుటుంబ పోషణ కోసం ఓ పక్క ఇడ్లీల వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఈ వ్యాపారంతో పాటు ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also:Ban Hookah Bars: హుక్కా బార్లను బ్యాన్ చేసిన కర్ణాటక..

దీపక్ ఉదయం ఇడ్లీలు అమ్మి మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్తాడు. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక మళ్లీ ఇడ్లీలు అమ్మడం మొదలుపెడతాడు. అంతకుముందు అతను క్రెడిట్ కార్డుతో తన ఇంటిని నడిపించాడని చెప్పాడు. ఆ తర్వాత రూ.2 లక్షల రుణం పొంది డిఫాల్టర్‌గా ప్రకటించారు. దీని తర్వాత దీపక్ తన ఇంటి నిర్వహణ కోసం కొంతమంది బంధువుల వద్ద అప్పులు చేశాడు. ఇప్పటి వరకు ఇతరుల నుంచి రూ.4 లక్షల రుణం తీసుకున్నట్లు తెలిపారు. చాలా మంది వద్ద అప్పు చేసి తిరిగి చెల్లించలేక పోవడంతో ప్రజలు కూడా ఆయనకు అప్పు ఇవ్వడం మానేశారు. ఆ తర్వాత అతని పరిస్థితి విషమించడం ప్రారంభించింది. కుటుంబ ప్రయోజనాల కోసం అతని భార్య తన ఆభరణాలను తనఖా పెట్టే స్థాయికి చేరుకుంది.

Read Also:BiggBoss7 Telugu : హౌస్ లో రెచ్చిపోతున్న రతిక.. ప్రశాంత్ అంటే అంత ప్రేమా?

దీపక్ మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందినవాడు. 2012లో హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో చేరేందుకు రూ.25,000 జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పాడు. హెచ్‌ఈసీలో అతనికి రూ.8వేలు మాత్రమే వచ్చేవి. అతను హెచ్ఈసీ పై భారీ అంచనాలు పెట్టుకొని మొదట వచ్చిన మంచి ఉద్యోగాన్ని వదిలి తప్పుచేశాడు. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వారు పాఠశాలలో చదువుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు తన కూతుళ్ల స్కూల్ ఫీజు కట్టలేని నిస్సహాయతతో స్కూల్ వాళ్లు అతనికి నోటీసులు పంపుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి దీపక్ కుమార్ ఉప్రారియా మాత్రమే ఇతర వ్యాపారాలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆయనలాగే మరెందరో వారి కుటుంబ పోషణకు చిన్న చిన్న పనులు చేస్తూ జీవితం వెల్లదీస్తున్నారు. వారిలో మధుర్ కుమార్ (మోమోస్ అమ్మడం), ప్రసన్న భోయ్ (టీ అమ్మడం), సుభాష్ కుమార్ (బ్యాంక్ డిఫాల్టర్‌గా ప్రకటించాడు), మిథిలేష్ కుమార్ (ఫోటోగ్రఫీ), సంజయ్ టిర్కీ (రూ. 6 లక్షల అప్పులో) ఉన్నారు. ఈ వార్తల పైన నిజం లేదని కొందరు కొట్టి పారేస్తున్నారు.