NTV Telugu Site icon

Ra Kadalira: నేడు ఉరవకొండ చంద్రబాబు.. ‘రా.. కదలిరా’ పేరుతో పర్యటన..

Babu

Babu

నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘రా.. కదలిరా’ సభ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. 11:15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 11:50 గంటలకు పీలేరుకు చేరుకోనున్నారు. పీలేరులో 11:50 నుంచి మధ్యాహ్నం 1:30 వరకూ చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభలో పాల్గొంటారు. ఆ వెంటనే రోడ్డు మార్గం ద్వారా పీలేరు మండలంలోని వేపులబైలు గ్రామానికి చేరుకోనున్నారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఉరవకొండ మండలంలోని లతవరం చేరుకోని.. అక్కడ సాయంత్రం 5:30 వరకూ చంద్రబాబు సభ నిర్వహిస్తారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఉరవకొండ మండలంలోని లతవరం చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5:30 వరకూ టీడీపీ నిర్వహించే రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.

Read Also: Budget 2024 : బడ్జెట్లో మధ్యతరగతి ప్రజల ఈ 4అంచనాలు నెరవేరుతాయా ?

‘రా.. కదలిరా’ పేరుతో 12 రోజుల్లో మొత్తం 22 సభలు నిర్వహించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా 25 లోక్‌సభ స్థానాల పరిధిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సభను టీడీపీ ఏర్పాటు చేస్తుంది. తొలి సభ ఈ నెల 5న ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని కనిగిరిలో జరిగింది. ఇక, సంక్రాంతి వల్ల ఈ నెల 11 నుంచి 17 వరకు సభలకు విరామం ఇచ్చారు. అలాగే అయోధ్య రామాలయం వల్ల 21వ తేదీ నుంచి 23 వరకూ కూడా సభలకు గ్యాప్ ఇచ్చారు. ఇక, ఆ తరువాత అంతా యథావిధిగా కొనసాగుతుంది. అయితే, ఈ సభకు సంబంధించి టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేసింది. చంద్రబాబు ఉరవకొండకు చేరుకోగానే ఆయనకు పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాము ఏమి చేస్తామనే అంశాలను చంద్రబాబు ప్రజలకు చెప్పబోతున్నారు.