11-07-22 Business Flash: మరికొన్ని బిజినెస్ వార్తలు.. స్టాక్ మార్కెట్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగేళ్లలో మెరుగుపడ్డ ఆర్థిక రంగం
గడచిన నాలుగేళ్లలో దేశ ఆర్థిక రంగం పనితీరు స్థిరంగా మెరుగుపడింది. పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (PHDCCI) ఈ విషయాన్ని తెలిపింది. ప్రపంచంలోని టాప్ 10 ఎకానమీలపై విశ్లేషణ జరిపి ఫలితాలను వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఎకనమిక్ రెజిలియెన్స్ (ఐఈఆర్) ర్యాంక్లే దీనికి నిదర్శనమని పేర్కొంది. ఐఈఆర్ ర్యాంక్ల్లో మన దేశం 2019లో 6వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 2వ ర్యాంకుకి చేరుకోవటం విశేషం.
Also Read
ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రైవేట్ వాటాల పెంపు?
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రైవేట్ వాటాల పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ లిమిట్ 10 శాతానికి మించకూడదనే రూలు ప్రస్తుతం అమల్లో ఉంది. దీంతో ఈ నిబంధనను తొలగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలకు మార్గం సుగమం చేయనుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో (పీఎస్బీల్లో) బయటి పెట్టుబడులు పెరగనున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు వాటాలను సొంతం చేసుకోనున్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు దారితీయొచ్చు.
7కి పైన స్థిరంగా రిటైల్ ద్రవ్యోల్బణం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణంలో పెద్దగా మార్పు కనిపించట్లేదు. జూన్ నెలలోనూ ఏడు శాతానికి కొంచెం పైనే కొనసాగింది. ఇటీవలి కాలంలో ఆహార ధరలు గణనీయంగా పెరిగాయి. గత రెండేళ్లలో శరవేగంగా వృద్ధిచెందాయి. దీంతో ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్పై పన్నులను తగ్గించింది. ఆహార ఎగుమతుల పైనా ఆంక్షలను అమలుచేసింది. ఈ నేపథ్యంలో మొత్తానికి ద్రవ్యోల్బణం పాక్షికంగా అదుపులోనే ఉందని చెప్పొచ్చు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
గతవారం భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 16,150 పాయింట్ల దిగువకు వచ్చింది. దీంతో ఐటీ షేర్లు 3 శాతం లాసయ్యాయి. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టెక్ మహింద్రాలు 2 శాతం నష్టాన్ని చవిచూశాయి. మరోవైపు.. 5జీ స్పెక్ట్రం వేలంలోకి గౌతమ్ అదానీ గ్రూపు కూడా ఎంటరవటంతో భారతీ ఎయిర్టెల్ షేర్లు 4 శాతం నష్టపోవటం గమనార్హం.
తాజావార్తలు
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: వైభవ్ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరే మా విజయానికి కారణం!
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!