NTV Telugu Site icon

Rahul Gandhi : పార్లమెంట్‌లో రైతులతో రాహుల్ గాంధీ భేటీపై వివాదం

New Project 2024 07 24t125322.486

New Project 2024 07 24t125322.486

Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో రైతులతో సమావేశం కానున్నారు. పార్లమెంట్‌లోని రాహుల్ గాంధీ ఛాంబర్‌లో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ ఇప్పటికే చర్చనీయాంశమైంది. రైతులకు పాస్‌లు ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఈ విషయం మీడియా ముందుకు రావడంతో రాహుల్‌ను కలిసేందుకు రైతులను అనుమతించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నందున కొంతమంది రైతులను నా ఛాంబర్‌కు పిలిపించానని, అయితే వారి పాస్‌లు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. నేనే వారిని కలవడానికి వెళ్తున్నాను. ఇది ఒక సమస్య అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. మీడియాలో వార్తలు రావడంతో రైతులు లోనికి వెళ్లేందుకు పాస్ లు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు రాహుల్ ఛాంబర్‌లో సమావేశం కానుంది.

Read Also:Haromhara: అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్, దేశవ్యాప్తంగా ట్రెండింగ్..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లోని పలువురు రైతు నేతలను తనను కలవాలని పిలుపునిచ్చారు. బుధవారం పార్లమెంటు హౌస్‌కి చేరుకున్న ఈ రైతు నేతలకు ఎంట్రీ ఇవ్వకపోవడంతో రాహుల్ గాంధీ మండిపడ్డారు. వీరందరినీ సభకు పిలిచామని చెప్పారు. అయితే ఇంతమందిని పార్లమెంటుకు రానియ్యలేదు. వారు రైతులు కావడం వల్ల ప్రభుత్వం వారిని లోపల చూడకూడదలు కోలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ అభ్యంతరం చెప్పడంతో వారికి ఎంట్రీ పాస్ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా తనకు లభించిన పార్లమెంట్ హౌస్‌లోని తన కార్యాలయంలో రైతు నాయకులను కలవనున్నారు.

Read Also:Niharika : కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ అప్ డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే ..?