Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్..
- 18 నెలల కాలంలో అప్పుల రాష్ట్రంగా మారిన ఆంధ్రరాష్ట్రం
- అప్పులు దేని కోసం ఖర్చు చేస్తున్నారో చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఈ 18 నెలల కాలంలో అప్పుల రాష్ట్రంగా మారిందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం రూ.2.66 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో రూ.3.45 లక్షలు కోట్ల వరకు అప్పు చేసాం, ఆ అప్పులు కూడా పీపీటీ రూపంలో సంక్షేమ పథకాలు కోసం ఖర్చు పెట్టిన విషయం అందరికి తెలుసు, కానీ ఈ ప్రభుత్వం చేసిన అప్పులు దేనికోసం ఖర్చు పెడుతుందో ఎవరికి తెలీదని అన్నారు. అప్పుల ఆంధ్రగా రాష్ట్రం దూసుకు పోతుందని చెప్పారు.
READ ALSO: KTR-Akhilesh Yadav : రామేశ్వరం కేఫ్లో కేటీఆర్ -అఖిలేశ్.. కలిసి టిఫిన్..
Also Read
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
సంపద సృష్టించడం వచ్చు, చంద్రుడు మీద సంపద సృష్టిస్తాం అని చెప్పారు, కానీ ఆచరణలో మాత్రం అది కనపడట్లేదని విమర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆనాటి బీజేపీ అధ్యక్షులు బురద జల్లి ప్రజల్లో భయాందోళన సృష్టించారని, ఇప్పుడు చూస్తే మరో శ్రీలంక, మరో బంగ్లా దేశ్ అయిపోతుంది అన్నారు. అప్పు చేసిన రూ.2. 66 లక్షల కోట్లు దేని కోసం అనేది లెక్కలు చెప్పాలని అన్నారు. ఆఖరికి మద్యం అమ్మకాలు మీద అప్పులు తీసుకొస్తున్నారని విమర్శించారు. నాకు అనుభవం ఉందని చంద్రబాబు, అనుభవం లేదని జగన్ మోహన్ రెడ్డిని విమర్శించారు, అలాగే రూ.3.40 లక్షల కోట్లు అప్పులు ఇష్టనుసారంగా చేసేస్తున్నారని, రాష్ట్రం అప్పుల ఊభిలో కూరుకుపోతుందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం చేసిన అప్పులు విద్యా, వైద్యం, వ్యవసాయం కోసం ఖర్చు చేశామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం రైతులను కష్ట పెడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కోసం, పండించిన పంటల గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఎలాంటి పరిస్థితి ఉందో చూస్తున్నామని అన్నారు.
READ ALSO: Mana Shankara Varaprasad Garu : ఆరోజే సంక్రాంతికి దిగుతున్న శంకర్ వరప్రసాద్ గారు
తాజావార్తలు
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
-
Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
-
Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?