Bommarillu Bhaskar : డీజే టిల్లు తో సినిమాను సెట్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దు జొన్నలగడ్డ.ఈ యంగ్ హీరో ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలం అయింది.జోష్ మరియు ఆరెంజ్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్దు గుంటూరు టాకీస్ సినిమా తో హీరోగా మారిపోయారు.ఆ సినిమాలో హీరో గా సిద్దూ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో హీరో గా నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయాయి.అయితే గత ఏడాది డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సినిమాలో సిద్దూ క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాతో సిద్దూ కు హీరో గా మంచి గుర్తింపు లభించింది.ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈయనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్దు డీజే టిల్లు సినిమాకు సీక్వల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ పనులతో పాటు ఇతర సినిమాలలో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా సిద్దూ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
బొమ్మరిల్లు సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ భాస్కర్ ఆరెంజ్ సినిమాతో ఊహించని డిజాస్టర్ ను అందుకున్నారు. అనంతరం ఈయన అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. అయితే త్వరలోనే బొమ్మరిల్లు భాస్కర్ సిద్దు జొన్నలగడ్డతో సినిమా చేయనున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరెంజ్ సినిమా లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్దు జొన్నలగడ్డతో ఏకంగా ఓ సినిమా చేయబోతున్నారు అంటే ఇది నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా దాదాపు ఫిక్స్ అయిందని సమాచారం.ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ఆగస్టు 10వ తేదీ ఘనంగా జరుపబోతున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను కూడా త్వరలోనే అధికారకంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
Also Read
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
తాజావార్తలు
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!