Nigeria: రక్తసిక్తమైన నైజీరియా.. 30 మందిపైగా మృతి
- కసువాన్-దాజీ గ్రామంలో కాల్పులు
- స్థానిక మార్కెట్కు, ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nigeria: ఉత్తర నైజీరియాలో మరో రక్తసిక్త దాడి జరిగింది. నైజర్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు 30 మందికి పైగా చంపి, అనేక మంది గ్రామస్థులను అపహరించారని ఆదివారం పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే ఈ ప్రాంతం హింస, అభద్రతతో పోరాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం నైజర్ రాష్ట్రంలోని బోర్గు స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని కసువాన్-దాజీ గ్రామంలో ఈ దాడి జరిగింది.
READ ALSO: Samudra Pratap: భారత కోస్ట్ గార్డ్ కు అత్యాధునిక స్వదేశీ నౌక.. ‘సముద్ర ప్రతాప్’ ప్రారంభానికి సిద్ధం
Also Read
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
ఈ సందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. సాయుధులైన దుండగులు అకస్మాత్తుగా గ్రామంలోకి ప్రవేశించి ప్రజలపై నేరుగా కాల్పులు జరిపారు. కాల్పుల తర్వాత, దుండగులు స్థానికంగా ఉన్న మార్కెట్కు, అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు. దీని కారణంగా గ్రామంలో తీవ్ర నష్టం వాటిల్లింది. కసువాన్-దాజీపై దాడి చేసిన సాయుధ వ్యక్తులు నేషనల్ పార్క్ ఫారెస్ట్, కాబే జిల్లా నుంచి వచ్చారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో విస్తారమైన అడవులు ఉన్నాయి. ఇవి సాయుధ ముఠాలకు దాక్కునే ప్రదేశాలుగా పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు. కసువాన్-దాజీ గ్రామానికి సమీపంలో పాపిరి కమ్యూనిటీ నివసిస్తుంది. గత నవంబర్లో ఒక కాథలిక్ పాఠశాల నుంచి 300 మందికి పైగా పిల్లలు, ఉపాధ్యాయులను అపహరించారు.
తాజాగా జరిగిన దాడిలో కనీసం 30 మంది మరణించారని నైజర్ రాష్ట్ర పోలీసు ప్రతినిధి వాసియు అబియోడున్ తెలిపారు. అయితే కొంతమంది గ్రామస్థులు మాట్లాడుతూ.. మృతుల సంఖ్య 37 కంటే ఎక్కువగా ఉండవచ్చని, చాలా మంది ఇంకా కనిపించడం లేదని చెబుతున్నారు. దాడి జరిగినప్పటి నుంచి భద్రతా దళాలు ఇంకా తమ గ్రామానికి రాలేదని పలువురు గ్రామస్థులు వాపోతున్నారు. అపహరణకు గురైన వ్యక్తుల కోసం వెతకడానికి దళాలను మోహరించామని పోలీసులు చెబుతుండగా, తాము పోలీసులు లేదా సైన్యం ఉనికిని చూడలేదని గ్రామస్థులు పేర్కొన్నారు. వాస్తవానికి నైజీరియా ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం. కానీ అనేక మారుమూల ప్రాంతాలలో భద్రత చాలా బలహీనంగా ఉంటుంది. నేరస్థుల ముఠాలు, సాయుధ నేరస్థులు ఈ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ, తరచుగా గ్రామాలపై దాడి చేస్తున్నారు.
READ ALSO: Sarfaraz Khan: దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదుగా.. పాపం సర్ఫరాజ్ ఖాన్!
తాజావార్తలు
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!