Nigeria: రక్తసిక్తమైన నైజీరియా.. 30 మందిపైగా మృతి
- కసువాన్-దాజీ గ్రామంలో కాల్పులు
- స్థానిక మార్కెట్కు, ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nigeria: ఉత్తర నైజీరియాలో మరో రక్తసిక్త దాడి జరిగింది. నైజర్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు 30 మందికి పైగా చంపి, అనేక మంది గ్రామస్థులను అపహరించారని ఆదివారం పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే ఈ ప్రాంతం హింస, అభద్రతతో పోరాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం నైజర్ రాష్ట్రంలోని బోర్గు స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని కసువాన్-దాజీ గ్రామంలో ఈ దాడి జరిగింది.
READ ALSO: Samudra Pratap: భారత కోస్ట్ గార్డ్ కు అత్యాధునిక స్వదేశీ నౌక.. ‘సముద్ర ప్రతాప్’ ప్రారంభానికి సిద్ధం
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఈ సందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. సాయుధులైన దుండగులు అకస్మాత్తుగా గ్రామంలోకి ప్రవేశించి ప్రజలపై నేరుగా కాల్పులు జరిపారు. కాల్పుల తర్వాత, దుండగులు స్థానికంగా ఉన్న మార్కెట్కు, అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు. దీని కారణంగా గ్రామంలో తీవ్ర నష్టం వాటిల్లింది. కసువాన్-దాజీపై దాడి చేసిన సాయుధ వ్యక్తులు నేషనల్ పార్క్ ఫారెస్ట్, కాబే జిల్లా నుంచి వచ్చారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో విస్తారమైన అడవులు ఉన్నాయి. ఇవి సాయుధ ముఠాలకు దాక్కునే ప్రదేశాలుగా పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు. కసువాన్-దాజీ గ్రామానికి సమీపంలో పాపిరి కమ్యూనిటీ నివసిస్తుంది. గత నవంబర్లో ఒక కాథలిక్ పాఠశాల నుంచి 300 మందికి పైగా పిల్లలు, ఉపాధ్యాయులను అపహరించారు.
తాజాగా జరిగిన దాడిలో కనీసం 30 మంది మరణించారని నైజర్ రాష్ట్ర పోలీసు ప్రతినిధి వాసియు అబియోడున్ తెలిపారు. అయితే కొంతమంది గ్రామస్థులు మాట్లాడుతూ.. మృతుల సంఖ్య 37 కంటే ఎక్కువగా ఉండవచ్చని, చాలా మంది ఇంకా కనిపించడం లేదని చెబుతున్నారు. దాడి జరిగినప్పటి నుంచి భద్రతా దళాలు ఇంకా తమ గ్రామానికి రాలేదని పలువురు గ్రామస్థులు వాపోతున్నారు. అపహరణకు గురైన వ్యక్తుల కోసం వెతకడానికి దళాలను మోహరించామని పోలీసులు చెబుతుండగా, తాము పోలీసులు లేదా సైన్యం ఉనికిని చూడలేదని గ్రామస్థులు పేర్కొన్నారు. వాస్తవానికి నైజీరియా ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం. కానీ అనేక మారుమూల ప్రాంతాలలో భద్రత చాలా బలహీనంగా ఉంటుంది. నేరస్థుల ముఠాలు, సాయుధ నేరస్థులు ఈ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ, తరచుగా గ్రామాలపై దాడి చేస్తున్నారు.
READ ALSO: Sarfaraz Khan: దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదుగా.. పాపం సర్ఫరాజ్ ఖాన్!
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!