Site icon NTV Telugu

Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి..25మందికి గాయాలు

Fire Accident

Fire Accident

Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోలాపూర్ జిల్లాలోని బార్షి తాలూకాలోని షిరాలే-పాంగ్రీ పరిధిలో ఉన్న సోభే మద్యం ఫ్యాక్టరీలో కొత్త సంవత్సరం తొలిరోజు భారీ పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడులో ఐదుగురు మరణించారని, 20 నుంచి 25 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బార్షి తాలూకాలోని షిరాలే-పాంగ్రీ ప్రాంతంలో ఆర్నమెంటల్ మద్యం ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ పటాకులు, మందుగుండు సామాగ్రిని తయారు చేస్తారు.

Read Also: Blink It: ‘బ్లింకిట్’కే మైండ్ బ్లాక్ అయ్యే ఆర్డర్ ఇచ్చిన బెంగుళూరు వాసి

ఈ ప్రదేశంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్ధం కనీసం ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న బార్షీ అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ వెంటనే పోలీసు బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలు కష్టతరంగా మారుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు, 4 మృతదేహాలను ఫ్యాక్టరీ నుంచి బయటకు తీయగా, గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version