NTV Telugu Site icon

Ramesh Rathod: ఉట్నూర్ లో నేడు మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ అంత్యక్రియలు..

Ramesh Rathode

Ramesh Rathode

Ramesh Rathod: బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ శనివారం కన్నుమూశారు. ఉదయం తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను మొదటగా ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తరలిస్తున్న మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారు. దాంతో రమేశ్ రాథోడ్ మృతదేహనన్ని ఆయన స్వస్థలం ఉట్నూరుకు తరలించారు. ఆయన మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేసారు. ఇక రమేశ్ రాథోడ్ రాజకీయ ప్రస్థానంలో 1999లో ఖానాపూర్ అసెంబ్లీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిపొంది., ఆ తర్వాత 2006 నుంచి 2009 మధ్య ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. తిరిగి మళ్లీ 2014లో ఖానాపూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేశారు. ఇక చివరగా 2021లో ఈటల రాజేందర్ తో కలిసి ఆయన బీజేపీలో చేరారు.

Suryakumar Yadav Catch: ‘సూర్యా’ భాయ్.. చరిత్రలో నిలిచిపోయే క్యాచ్‌ (వీడియో)!

ఇక బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంత్యక్రియలు ఈ రోజు ఆదివారం నాడు ఉదయం 10 : 30 గంటలకు జరుగుతాయి. ఉట్నూర్ లోని వారి నివాసం నుండి ప్రారంభమై X రోడ్ ( నాగపూర్ ) చౌరస్థ లోని వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

MODI: “140 కోట్ల మంది దేశప్రజలు మీ అద్భుత ఆటతీరుకు గర్వపడుతున్నారు”..ఇండియా టీం పై మోడీ ప్రశంసలు