Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!
- బీహార్లో భారీ పోలీస్ ఆపరేషన్
- మదర్సాలో ఆయుధాల కలకలం.. ముగ్గురు అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Madarsa: బీహార్లోని మోతిహారి జిల్లాలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడులు ఇప్పుడు సంచలనం సృష్టించాయి. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో, ఒక మదర్సా ప్రాంగణంపై పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమ ఆయుధాలు, కీలక పత్రాలు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. ఈ దాడిలో సంఘటనా స్థలం నుంచి ఒక పిస్టల్, తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏదైనా పెద్ద నేరానికి లేదా విధ్వంసానికి పాల్పడేందుకు ఇక్కడ కుట్ర జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయుధాలతో పాటు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
READ ALSO: Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్ నిజం కాదు.. APSDMA క్లారిటీ..
Also Read
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
మోతిహారి ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మాట్లాడుతూ.. ఈ మదర్సాలో ఆయుధాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయని, పెద్ద నేరానికి ప్రణాళికలు రచిస్తున్నారని ముందస్తు సమాచారం అందింది. దీంతో చకియా డీఎస్పీ సంతోష్ కుమార్, ఎస్హెచ్ఓ మున్నా కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం మదర్సాపై దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్ సందర్భంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను పిలిపించి సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మదర్సా ప్రాంగణాన్ని సీల్ చేసి, భారీ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. “అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు ఏదైనా నేర ముఠాలతో లేదా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో లోతుగా విచారిస్తున్నాము” అని తెలిపారు. గతంలో ఇదే మదర్సా నుంచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తో సంబంధం ఉన్న యాకూబ్ (అలియాస్ సుల్తాన్)ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. అయోధ్య రామమందిరంపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టి, బెదిరింపులకు పాల్పడిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారి నెట్వర్క్ ఎక్కడ వరకు విస్తరించింది అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నామన్నారు.
READ ALSO: Stock Market: మార్కెట్కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు
తాజావార్తలు
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!