Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dubai: విమాన ప్రయాణంలో మొబైల్ ఫోన్తో ఫోటోలు, వీడియోలు తీయడం ఓ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. సరదాకో, తెలియకో చేసిన ఒక చిన్న పొరపాటు.. ఏకంగా పదేళ్ల జైలు శిక్షకు దారితీసింది. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా సదర్ బ్లాక్ పరిధిలోని రఫీ ఇందర్వా గ్రామానికి చెందిన అమీరుల్ మియాన్ కుమారుడు వసీం అక్రమ్ ఉపాధి కోసం ఈ ఏడాది మార్చిలో దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) పరిశ్రమలో పనిచేసే ఒక కాంట్రాక్టర్ వద్ద కూలీగా చేరి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, దుబాయ్ వెళ్లే క్రమంలో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు వసీం అక్రమ్ తన మొబైల్ ఫోన్తో కొన్ని ఫొటోలు, వీడియోలు రికార్డు చేశాడు. దుబాయ్లోని కఠినమైన భద్రత, గోప్యత (ప్రైవసీ) చట్టాల ప్రకారం విమానం లోపల ఫొటోలు, వీడియోలు తీయడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే వసీం అక్రమ్ను అక్కడ అరెస్ట్ చేసి, విచారణ అనంతరం దుబాయ్ కోర్టు ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
ఈ విషయం తెలియడంతో వసీం అక్రమ్ స్వగ్రామం ఇందర్వాలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. తన కుమారుడు ఎటువంటి దురుద్దేశంతో ఆ ఫొటోలు తీయలేదని, అతడు చాలా అమాయకుడని వసీం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం జ్ఞాపకంగా దాచుకోవడానికో లేదా అనుకోకుండానే ఆ ఫొటోలు తీసి ఉంటాడని, అక్కడి కఠినమైన నియమ నిబంధనల గురించి అతనికి అస్సలు తెలియదని వారు చెబుతున్నారు. గడిచిన రెండు నెలలుగా వసీంతో మాట్లాడటానికి వీలు లేకుండా పోయిందని, అతడిని రెండు నెలల క్రితమే అరెస్ట్ చేసినప్పటికీ.. ఈ విషయం తమకు గురువారం నాడే తెలిసిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
వసీం తల్లి శైదా ఖాతూన్ తన కొడుకు అరెస్ట్ అయిన క్షణాలను గుర్తుచేసుకుంటూ.. “నా కొడుకు శుక్రవారం ప్రార్థనలు ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే, పోలీసులు వచ్చి అతనితో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత విచారణ జరిపి మిగిలిన వారందరినీ వదిలేశారు. కానీ, నా కొడుకు మొబైల్ ఫోన్లో విమానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు దొరకడంతో అతడిని మాత్రం జైలుకు పంపారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ పరిస్థితుల్లో న్యాయం చేయాలంటూ వసీం కుటుంబ సభ్యులు గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ పవన్ కుమార్ సిన్హాను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. వసీం ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు, సోదరి, భార్య సల్మా ఖాతూన్, ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారని.. ప్రస్తుతం అతని భార్య అనారోగ్యంతో బాధపడుతోందని జిల్లా మేజిస్ట్రేట్కు వివరించారు. ఆ కుటుంబానికి వసీం ఒక్కడే ఆధారమని, అతను జైలుపాలు కావడంతో ఆదాయ వనరు పూర్తిగా కోల్పోయి రోడ్డున పడ్డామని శైదా ఖాతూన్ వాపోయారు. ఈ వ్యవహారాన్ని గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ పవన్ కుమార్ సిన్హా తీవ్రంగా పరిగణించారు. బాధితుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదును, వినతిపత్రాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇస్తూ.. దీనిపై తక్షణమే హోం శాఖకు సమగ్ర నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. తెలియక చేసిన పొరపాటుకు ఒక పేద కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితిలో పడిపోవడం స్థానికంగా అందరినీ కలచివేస్తోంది.
తాజావార్తలు
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?