బిగ్ బాస్ తెలుగు 7 హౌస్ లో ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొత్త వాళ్లు ఇంట్లోకి రానున్నారని తెలుస్తుంది.. గత కొన్ని రోజులుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉందనే వార్తలు వస్తున్నాయి.. కానీ ఈ వారం ఫైనల్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఏకంగా మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరో 6గురు కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపుతున్నారట.. గత ఆరు సీజన్లో ఎన్నడూ లేని విధంగా కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ షో మొదలైంది. సాధారణంగా 19 నుండి 21 మంది కంటెస్టెంట్స్ తో షో లాంచ్ చేస్తారు. సీజన్ 7లో వివిధ కారణాలతో అతి తక్కువ మంది హౌస్లోకి వెళ్లారు. వీరిలో నలుగురు ఎలిమినేట్ అయ్యారు..
ఇక ఈ వారం నామీనేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు.. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, తేజా, శోభా శెట్టి, గౌతమ్, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, శివాజీ, సందీప్, ప్రియాంక ఉన్నారు..ఈ క్రమంలో ఒకేసారి ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లనున్నారట. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదే అంటున్నారు. అక్టోబర్ 8 ఆదివారం మరో లాంచింగ్ ఈవెంట్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ ద్వారా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఇంట్లోకి పంపనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. గత ఎపిసోడ్స్ లో ఎన్నడు లేని విధంగా కొత్త ప్రయోగాన్ని చేస్తున్నారు బిగ్ బాస్ చేస్తున్నారు..
మరి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆ ఆరుగురు కంటెస్టెంట్స్ ఎవరంటే… జబర్దస్త్ కెవ్వు కార్తీక్ అట. అలాగే సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షామిలి, సీరియల్ నటి అంజలి పవన్, సీరియల్ నటి నయని పావని అంటున్నారు.. ఇక మినీ లాంచ్ ఈవెంట్ పై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.. లిస్ట్ లో ఉన్న ఆరుగురిలో ఎక్కువ మంది సీరియల్ నటులే కావడం విశేషం. నిజంగా వీరు హౌస్లోకి వెళితే సీరియల్ బ్యాచ్ శక్తి పెరిగే అవకాశం ఉంది. ప్రతి సీజన్ కి హౌస్లో రెండు మూడు గ్రూప్ లు ఏర్పడతాయి. ఈసారి సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ బ్యాచ్ గా హౌస్ నడిచే అవకాశం ఉంది.. వీరితో ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో చూడాలి..