Bhumana Karunakar Reddy: తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల లడ్డు విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసిపినీ సమూలంగా నాశనం చేయడానికి చంద్రబాబు చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నాడు.. ఘటనపై సిబిఐ విచారణ కాని., సిట్టింగ్ జడ్జ్ తో కాని విచారణకు అదేశించే దమ్ముందా..? వెంకటేశ్వర స్వామీ ఆలయాన్ని నాశనం చేశారంటూ అబద్దాలు చెప్పి ఓట్లు వెయించుకున్నాడు చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వేసినా విజిలెన్స్ విచారణ ఎమీ దొరక పోవడంతో లడ్డుపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు చంద్రబాబు. ఆయన ఘోరమైన అపచారం చేశాడు. బాబు చేసినా అపచారాలను స్వామీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు. నెయ్యి బదులుగా జంతువుల కోవ్వు కలిపారని దుర్మార్గమైన, నీచమైన ఆరోపణలు చేశారు. లడ్డుపై చేసినా ఆరోపణలు అబద్దం అయితే అలా చేసినా వారు రక్తం కక్కుకుని చస్తారు.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పోడిచి అధికారలోకి వచ్చావు.
ఇప్పుడు కులదైవం అని చెప్పుకునే స్వామీవారిని సిగ్గు,లజ్జా అన్నది ఎమీ మాత్రం లేకుండా నీ రాజకీయ వాడుకున్నావ్…
Devara : దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. NTR నట విశ్వరూపం..
చంద్రబాబు చెప్పినట్లు ఈవో రిపొర్టు ఇచ్చారు. 2014 నుండి 2019 వరకు ఎందుకు నందినీ నెయ్యి వాడలేదో బాబు, లోకేష్ సమాధానం చెప్పాలి. చంద్రబాబు హాయంలో ఆయన సన్నిహితంగా ఉండే చెన్నైకి చెందిన వారు వ్యభిచారాన్ని తిరుమలలో నడిపారు. మా హాయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. టీడీపీ హాయంలో నెయ్యి సరఫరా చేసినా వాళ్ళే వైస్సార్సీపీ హయంలోను సరఫరా చేశారు. కాదు అని బాబు చెప్పగలడా.. కలుషితం అయ్యింది నెయ్యి కాదు చంద్రబాబు.. టీటీడీ ఈవో రిపొర్టు బయట పెట్టకుండా టీడీపీ ఆఫీస్ నుండి ఎలా రిపొర్టు బయట పెడుతారు. గత ప్రభుత్వంలో టీటీడీ సంబందించిన నెయ్యి నాణ్యత కమీటిలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, వైద్యనాధన్ కృష్ణా స్వామీ సభ్యులుగా ఉన్నారు. ఆరోపణలపై ఎలాంటి విచారణకు అయినా సిద్ధంగా ఉన్నాం. సిబిఐ విచారణ కాని సుప్రీంకోర్టు జడ్జ్ తో కాని విచారణకు అదేశించే దమ్ము చంద్రబాబుకు ఉందా.. దమ్ముంటే విచారణ జరపండని చాలెంజ్ విసురుతున్నాము అని ఆయన వ్యాఖ్యానించారు.
Devara : దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. NTR నట విశ్వరూపం..