Site icon NTV Telugu

Bhatti Vikramarka : కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Bhatti

Bhatti

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరి సంఖ్యను కోటికి పెంచి.. వారందరినీ కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 340 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 140 కోట్లు మొత్తంగా 480 కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాము.. ఈ రుణాలకు వడ్డీ 1566 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తుంది.. ఆర్థికంగా వారికి చేయూతనిస్తుందని, కొత్త విద్యుత్ పాలసీలో భాగంగా మహిళలను సోలార్ విద్యుత్ పైపు మళ్లించి ఆర్థికంగా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు భట్టి విక్రమార్క. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇప్పించి.. బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయించి ఆర్థికంగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

 

Exit mobile version