Bharat Rice: సామాన్యులకు శుభవార్త! రూ.29కే భారత్ రైస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయి. బియ్యం దగ్గర నుంచీ కూరగాయలు.. గ్యాస్.. పెట్రోల్ ఇలా ప్రతిదీ కొనలేని పరిస్థితి. సామాన్యుల దగ్గర నుంచి మధ్య తరగతి కుటుంబాల వారు ఈ ధరలతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడు బియ్యం ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మార్కెట్లో కిలో రైస్ రూ.40-50 ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.70-80 వరకు అమ్ముతున్నారు. ఈ ధరలతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం భారత్ రైస్ను (Bharat Rice) మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని భావించింది.
గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్తో పేదలకు ఒరిగిందేమీలేదని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పైగా సార్వత్రిక ఎన్నికల ముందు తాయిలాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ నిరలమ్మ మాత్రం ఉసురు మనిపించారు. ఇంకోవైపు బియ్యం ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో భారత్ రైస్ కార్యక్రమంతో రూ.29లకే కిలో బియ్యాన్ని రిటైల్ మార్కె్ట్ ద్వారా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచే భారత్ రైస్ను కిలో రూ.29లకు అందించబోతున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు.
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ఈ భారత్ రైస్ను నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో ఈ బియ్యాన్ని విక్రయించనున్నట్లు వెల్లడించారు. 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో ‘భారత్ రైస్’ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే భారత్ గోధుమపిండి కిలో రూ.27.50, శనగ పప్పు రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. భారత్ రైస్ విధానంతో సామాన్యులకు ఊరట కల్గుతుందని సంజీవ్ చోప్రా అభిప్రాయపడ్డారు.
- Tags
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!