Ganesh Immersion : గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసి.. 10గంటలు మళ్లీ దానికోసం వెతికారు
Ganesh Immersion : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీకో గణేషుడు భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. అంతటా అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు, నిమజ్జనాలు జరుగుతున్నాయి. పూజలు చేసిన అనంతరం నదులు, చెరువులకు చేరుకుని అక్కడ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు. అయితే కర్ణాటకలోని బెంగళూరులో వినాయక నిమజ్జనం తర్వాత డైవర్లు 10 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. ఇక్కడ ఒక కుటుంబం పూజ సమయంలో గణేశుడి విగ్రహానికి బంగారు గొలుసు వేసింది. నిమజ్జనం సమయంలో బంగారు గొలుసు తీయడం మరిచిపోయి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తర్వాత గుర్తొచ్చాక గొలుసు కోసం వెతుకులాట మొదలైంది.
Read Also:Nagari Politics: వైసీపీ ప్రక్షాళన..! మాజీ మంత్రి రోజా వ్యతిరేకులపై వేటు..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
10 గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు గొలుసును నీటిలో నుంచి బయటకు తీశారు. బెంగళూరులోని విజయనగర్లోని దాసరహళ్లి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ రామయ్య, ఉమాదేవి తమ ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆయన విగ్రహాన్ని పూలు, ఆభరణాలతో విపరీతంగా అలంకరించారు. రూ.4 లక్షల విలువైన 60 గ్రాముల బంగారు గొలుసును కూడా విగ్రహానికి వేశారు.
Read Also:Talasani Srinivas Yadav: ఆస్పత్రికి వెళ్లాలంటే హౌస్ అరెస్ట్ అంటారే..? పోలీసులపై తలసాని ఫైర్..
గురువారం రాత్రి విగ్రహాన్ని నిమజ్జనం కోసం మొబైల్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లారు. నిమజ్జనం అనంతరం విగ్రహానికి బంగారు గొలుసు వేసింది గుర్తొచ్చింది. దానిని తీయడం మరిచిపోయానని గుర్తు చేసుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన గంట తర్వాత మళ్లీ అక్కడికి చేరుకున్నారు. నిమజ్జనం సమయంలో గణపతి మెడలో గొలుసు కనిపించిందని, అయితే అది నకిలీదని భావిస్తున్నామని కొందరు తెలిపారు. దీంతో భార్యాభర్తలు మాగడి రోడ్డు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఎమ్మెల్యే ప్రియా కిషోర్ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే ట్యాంక్ కాంట్రాక్టర్ లంకేశ్ డితో మాట్లాడారు. ట్యాంక్ చుట్టూ ఉన్న వ్యక్తులు గొలుసు కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత ట్యాంక్ను ఖాళీ చేయాలని నిర్ణయించారు. అందులో దాదాపు 10 వేల లీటర్ల నీరు ఉంది. నీరంతా బయటకు పోయినప్పటికీ గొలుసు కనిపించలేదు. దీంతో నిమజ్జనం తర్వాత వదిలిన మట్టిలో గణేష్ విగ్రహాలు లభ్యమయ్యాయి. దాదాపు 10 మంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు మట్టిలో బంగారు గొలుసు దొరికింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో