Ganesh Immersion : గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసి.. 10గంటలు మళ్లీ దానికోసం వెతికారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Immersion : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీకో గణేషుడు భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. అంతటా అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు, నిమజ్జనాలు జరుగుతున్నాయి. పూజలు చేసిన అనంతరం నదులు, చెరువులకు చేరుకుని అక్కడ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు. అయితే కర్ణాటకలోని బెంగళూరులో వినాయక నిమజ్జనం తర్వాత డైవర్లు 10 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. ఇక్కడ ఒక కుటుంబం పూజ సమయంలో గణేశుడి విగ్రహానికి బంగారు గొలుసు వేసింది. నిమజ్జనం సమయంలో బంగారు గొలుసు తీయడం మరిచిపోయి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తర్వాత గుర్తొచ్చాక గొలుసు కోసం వెతుకులాట మొదలైంది.
Read Also:Nagari Politics: వైసీపీ ప్రక్షాళన..! మాజీ మంత్రి రోజా వ్యతిరేకులపై వేటు..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
10 గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు గొలుసును నీటిలో నుంచి బయటకు తీశారు. బెంగళూరులోని విజయనగర్లోని దాసరహళ్లి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ రామయ్య, ఉమాదేవి తమ ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆయన విగ్రహాన్ని పూలు, ఆభరణాలతో విపరీతంగా అలంకరించారు. రూ.4 లక్షల విలువైన 60 గ్రాముల బంగారు గొలుసును కూడా విగ్రహానికి వేశారు.
Read Also:Talasani Srinivas Yadav: ఆస్పత్రికి వెళ్లాలంటే హౌస్ అరెస్ట్ అంటారే..? పోలీసులపై తలసాని ఫైర్..
గురువారం రాత్రి విగ్రహాన్ని నిమజ్జనం కోసం మొబైల్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లారు. నిమజ్జనం అనంతరం విగ్రహానికి బంగారు గొలుసు వేసింది గుర్తొచ్చింది. దానిని తీయడం మరిచిపోయానని గుర్తు చేసుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన గంట తర్వాత మళ్లీ అక్కడికి చేరుకున్నారు. నిమజ్జనం సమయంలో గణపతి మెడలో గొలుసు కనిపించిందని, అయితే అది నకిలీదని భావిస్తున్నామని కొందరు తెలిపారు. దీంతో భార్యాభర్తలు మాగడి రోడ్డు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఎమ్మెల్యే ప్రియా కిషోర్ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే ట్యాంక్ కాంట్రాక్టర్ లంకేశ్ డితో మాట్లాడారు. ట్యాంక్ చుట్టూ ఉన్న వ్యక్తులు గొలుసు కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత ట్యాంక్ను ఖాళీ చేయాలని నిర్ణయించారు. అందులో దాదాపు 10 వేల లీటర్ల నీరు ఉంది. నీరంతా బయటకు పోయినప్పటికీ గొలుసు కనిపించలేదు. దీంతో నిమజ్జనం తర్వాత వదిలిన మట్టిలో గణేష్ విగ్రహాలు లభ్యమయ్యాయి. దాదాపు 10 మంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు మట్టిలో బంగారు గొలుసు దొరికింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!