Ganesh Immersion : గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసి.. 10గంటలు మళ్లీ దానికోసం వెతికారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Immersion : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీకో గణేషుడు భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. అంతటా అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు, నిమజ్జనాలు జరుగుతున్నాయి. పూజలు చేసిన అనంతరం నదులు, చెరువులకు చేరుకుని అక్కడ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు. అయితే కర్ణాటకలోని బెంగళూరులో వినాయక నిమజ్జనం తర్వాత డైవర్లు 10 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. ఇక్కడ ఒక కుటుంబం పూజ సమయంలో గణేశుడి విగ్రహానికి బంగారు గొలుసు వేసింది. నిమజ్జనం సమయంలో బంగారు గొలుసు తీయడం మరిచిపోయి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తర్వాత గుర్తొచ్చాక గొలుసు కోసం వెతుకులాట మొదలైంది.
Read Also:Nagari Politics: వైసీపీ ప్రక్షాళన..! మాజీ మంత్రి రోజా వ్యతిరేకులపై వేటు..
Also Read
- Supreme Court: 'గుడ్లకు భయమెందుకు?'.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
- Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
10 గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు గొలుసును నీటిలో నుంచి బయటకు తీశారు. బెంగళూరులోని విజయనగర్లోని దాసరహళ్లి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ రామయ్య, ఉమాదేవి తమ ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆయన విగ్రహాన్ని పూలు, ఆభరణాలతో విపరీతంగా అలంకరించారు. రూ.4 లక్షల విలువైన 60 గ్రాముల బంగారు గొలుసును కూడా విగ్రహానికి వేశారు.
Read Also:Talasani Srinivas Yadav: ఆస్పత్రికి వెళ్లాలంటే హౌస్ అరెస్ట్ అంటారే..? పోలీసులపై తలసాని ఫైర్..
గురువారం రాత్రి విగ్రహాన్ని నిమజ్జనం కోసం మొబైల్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లారు. నిమజ్జనం అనంతరం విగ్రహానికి బంగారు గొలుసు వేసింది గుర్తొచ్చింది. దానిని తీయడం మరిచిపోయానని గుర్తు చేసుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన గంట తర్వాత మళ్లీ అక్కడికి చేరుకున్నారు. నిమజ్జనం సమయంలో గణపతి మెడలో గొలుసు కనిపించిందని, అయితే అది నకిలీదని భావిస్తున్నామని కొందరు తెలిపారు. దీంతో భార్యాభర్తలు మాగడి రోడ్డు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఎమ్మెల్యే ప్రియా కిషోర్ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే ట్యాంక్ కాంట్రాక్టర్ లంకేశ్ డితో మాట్లాడారు. ట్యాంక్ చుట్టూ ఉన్న వ్యక్తులు గొలుసు కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత ట్యాంక్ను ఖాళీ చేయాలని నిర్ణయించారు. అందులో దాదాపు 10 వేల లీటర్ల నీరు ఉంది. నీరంతా బయటకు పోయినప్పటికీ గొలుసు కనిపించలేదు. దీంతో నిమజ్జనం తర్వాత వదిలిన మట్టిలో గణేష్ విగ్రహాలు లభ్యమయ్యాయి. దాదాపు 10 మంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు మట్టిలో బంగారు గొలుసు దొరికింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
-
Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!