Ganesh Immersion : గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసి.. 10గంటలు మళ్లీ దానికోసం వెతికారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Immersion : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీకో గణేషుడు భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. అంతటా అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు, నిమజ్జనాలు జరుగుతున్నాయి. పూజలు చేసిన అనంతరం నదులు, చెరువులకు చేరుకుని అక్కడ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు. అయితే కర్ణాటకలోని బెంగళూరులో వినాయక నిమజ్జనం తర్వాత డైవర్లు 10 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. ఇక్కడ ఒక కుటుంబం పూజ సమయంలో గణేశుడి విగ్రహానికి బంగారు గొలుసు వేసింది. నిమజ్జనం సమయంలో బంగారు గొలుసు తీయడం మరిచిపోయి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తర్వాత గుర్తొచ్చాక గొలుసు కోసం వెతుకులాట మొదలైంది.
Read Also:Nagari Politics: వైసీపీ ప్రక్షాళన..! మాజీ మంత్రి రోజా వ్యతిరేకులపై వేటు..
Also Read
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
10 గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు గొలుసును నీటిలో నుంచి బయటకు తీశారు. బెంగళూరులోని విజయనగర్లోని దాసరహళ్లి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ రామయ్య, ఉమాదేవి తమ ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆయన విగ్రహాన్ని పూలు, ఆభరణాలతో విపరీతంగా అలంకరించారు. రూ.4 లక్షల విలువైన 60 గ్రాముల బంగారు గొలుసును కూడా విగ్రహానికి వేశారు.
Read Also:Talasani Srinivas Yadav: ఆస్పత్రికి వెళ్లాలంటే హౌస్ అరెస్ట్ అంటారే..? పోలీసులపై తలసాని ఫైర్..
గురువారం రాత్రి విగ్రహాన్ని నిమజ్జనం కోసం మొబైల్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లారు. నిమజ్జనం అనంతరం విగ్రహానికి బంగారు గొలుసు వేసింది గుర్తొచ్చింది. దానిని తీయడం మరిచిపోయానని గుర్తు చేసుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన గంట తర్వాత మళ్లీ అక్కడికి చేరుకున్నారు. నిమజ్జనం సమయంలో గణపతి మెడలో గొలుసు కనిపించిందని, అయితే అది నకిలీదని భావిస్తున్నామని కొందరు తెలిపారు. దీంతో భార్యాభర్తలు మాగడి రోడ్డు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఎమ్మెల్యే ప్రియా కిషోర్ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే ట్యాంక్ కాంట్రాక్టర్ లంకేశ్ డితో మాట్లాడారు. ట్యాంక్ చుట్టూ ఉన్న వ్యక్తులు గొలుసు కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత ట్యాంక్ను ఖాళీ చేయాలని నిర్ణయించారు. అందులో దాదాపు 10 వేల లీటర్ల నీరు ఉంది. నీరంతా బయటకు పోయినప్పటికీ గొలుసు కనిపించలేదు. దీంతో నిమజ్జనం తర్వాత వదిలిన మట్టిలో గణేష్ విగ్రహాలు లభ్యమయ్యాయి. దాదాపు 10 మంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు మట్టిలో బంగారు గొలుసు దొరికింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?