Site icon NTV Telugu

Last Rites to Parrot: పెంపుడు చిలుకకు అంత్యక్రియలు చేసిన మనసున్న యజమాని

Parrot

Parrot

Last Rites to Parrot: మానవత్వం మంటకలిసిపోతున్న నేటి రోజుల్లో తారక్ మజుందార్‌ లాంటి వాళ్లు ఉన్నారంటే ఆశ్యర్యపోకమానదు. ఇంతకు ఆయన ఏం చేశారంటారా… చనిపోయిన తన పెంపుడు చిలుకకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి దానిపట్ల.. తన ప్రేమను చాటుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత 25 సంవత్సరాలుగా సొంత బిడ్డలా పెంచుకున్న… పెంపుడు చిలుక చనిపోవడంతో శాస్త్రం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది తారక్‌ మజుందార్ కుటుంబం. దానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Read Also: Jharkhand Wedding: పూరీలు వేడిగా లేవని రచ్చరచ్చ చేశారు.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

‘భక్తో’ అనే చిలుక గత 25 సంవత్సరాలుగా తారక్‌ మజుందార్ కుటుంబంలో ఒకరిగా నివసిస్తోంది. ఆ చిలుకను చిన్నపిల్లలా చూసుకున్న ఆ కుటుంబం.. చిలుక, ఇతర కుటుంబ సభ్యుల మాదిరిగానే, వారితో భోజనం తీసుకువెళ్లేది. నార్త్ 24 పరగణాస్‌లోని హబ్రాలోని ఆయ్రా గ్రామ నివాసి తారక్ మజుందార్ మాట్లాడుతూ, “మేము మా కుటుంబ సభ్యుడిగానే అతనిని చాలా ప్రేమించాము. అది మాతో 25 సంవత్సరాలు ఉంది.” అని తెలిపారు. చిలుక శుక్రవారం అనారోగ్యానికి గురై చనిపోయిందని, ఆ తర్వాత హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. స్థానిక ప్రజలు కూడా తారక్ ఇంటికి చేరుకుని ప్రియమైన పెంపుడు చిలుకకు నివాళులు అర్పించారు. “భవిష్యత్తులో వారి కుటుంబంలో భక్తో మనిషిగా పుడతుంది.” అని మజుందార్‌ ఆకాంక్షించారు. మంగళవారం, మజుందార్ కుటుంబం ఒక పూజారిని పిలిచి, హిందూ ఆచారాల ప్రకారం వారి ఇంట్లో తమ ప్రియమైన పెంపుడు చిలుకకు అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం నైహతిలోని హుగ్లీ నది ఘాట్‌కు భౌతికకాయాన్ని తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. బుధవారం, కుటుంబం “భోజ్” (విందు) ఏర్పాటు చేసి, కనీసం 25 మందిని ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించింది.

Exit mobile version