టాలీవుడ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ తన డెబ్యూ సినిమా అల్లుడు శీను షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తొలి చిత్రం అల్లుడు శీను చిత్రీకరణ సమయంలో ఎదురైన అనుభవాలను ఆయన సరదాగా పంచుకున్నారు.
Also Read : Tollywood : టాప్ స్టార్ గా రామ్ చరణ్ మరొక రికార్డు.. లిస్ట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే
బెల్లం కొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ నేను అల్లుడు శీను సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు రోజు షూటింగ్ సమయంలో సెట్స్పై సుమారు 200 మంది క్రూ సభ్యులు ఉండేవారు. అయితే షూటింగ్ లో ఫైట్ సీన్లు చేస్తున్నప్పుడు గానీ, డ్యాన్స్ చేస్తున్నపుడు గానీ ఎవ్వరూ తనవైపు పెద్దగా చూసేవాళ్ళు కాదు. తాను ఎంత కష్టపడుతున్నా, ఎవరు కనీసం నన్ను పట్టించుకునే వారు కాదు. అందరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవారు. అయితే హీరోయిన్ సమంతతో రొమాంటిక్ లేదా కిస్సింగ్ సీన్ ఉంటే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అలాంటి సన్నివేశాలు షూట్ చేస్తుంటే సెట్స్లో ఉన్న 200 మంది క్రూ సభ్యులంతా నా దగ్గరికి వచ్చి గమనించేవాళ్లు, ఆ సమయంలో తాను కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయ్యేవాడినని తెలిపారు. బెల్లం కొండా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సరదాగా చెప్పినా, షూటింగ్ సమయంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో బెల్లం కొండ మాటల్లో స్పష్టమవుతోంది. ఏదేమైనా తొలిసినిమాతోనే బెల్లం కొండ స్టార్ హీరోయిన్ తో నటించి హిట్ కొట్టాడు. అన్నట్టు ఆ సినిమాలో మరొక టాప్ స్టార్ తమన్నా స్పెషల్ సాంగ్ లో బెల్లం కొండ పక్కన మెరిసింది.
