Singapore: దగ్గినందుకు జైలు శిక్ష.. అసలు కారణమేంటంటే?
Being Infected With Covid Indian origin man Coughing on Colleagues Jailed in Singapore: సింగపూర్ లో దగ్గినందుకు ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. అదేంటి దగ్గితేనే జైలు శిక్ష పడిందా అని అనుకుంటున్నారా? అయితే దాని చాలా పెద్ద కారణమే ఉంది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఎంత భయందోళనలు క్రియేట్ చేసిందో తెలిసిందే. దీని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇదిలా వుండగా తమిళ్ సెల్వం అనే వ్యక్తి సింగపూర్లోని ఓ కంపెనీలో క్లీనర్గా పని చేస్తున్నాడు. అయితే అతడికి 2021 లో ఆరోగ్యం పాడయ్యింది. అప్పట్లో కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉండటంతో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంట్లో అతడికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో టెస్ట్ ల అనంతరం అతడు ఇంటికి వెళ్లిపోకుండా తన ఆఫీసుకు వచ్చాడు. అయితే తనకి కోవిడ్ సోకింది సెలవు కావాలని తెలిపేందుకు అతడు ఆఫీసుకు వెళ్లాడు. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాని ఆఫీస్ సిబ్బంది సూచించాడు. అయినా తమిళ్ సెల్వం వెళ్లకుండా అక్కడక్కడే తిరిగాడు.
Also Read: Chiranjeevi on ANR : భారతీయ సినీ చరిత్రలోనే దిగ్గజ నటుడు.. ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అంతేకాకుండా అక్కడ పలుమార్లు దగ్గాడు కూడా. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది చాలా ఇబ్బందికి గురవడంతో పాటు చాలా భయపడింది. అయితే, ఘటన తర్వాత ఎవరికీ కరోనా సోకలేదు కానీ.. తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అందుకే అక్కడ పనిచేసే ఉద్యోగుల్లో కొందరు అతనిపై ఫిర్యాదు చేశారు. ఆఫీసులో కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కూడా ఉన్నారని వారికి తమిళ్ సెల్వం నిర్లక్ష్యం వల్ల కరోనా సోకి ఉంటే పరిస్థితి తీవ్రంగా మారేదని, ఎంత చెప్పినా వినకుండా అతడు అక్కడే ఉన్నారని ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసుుకున్న పోలీసులు అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా అతడు పలుమార్లు దగ్గడం కనిపించింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అన్ని విషయాలను పరిశీలించిన కోర్టు 64 సంవత్సరాల తమిళ్ సెల్వంకు రెండు వారాల జైలు శిక్ష విధించింది. సదరు వ్యక్తి కరోనా నిబంధనలు పాటించకుండా.. సహోద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ శిక్ష విధించినట్లు పేర్కొంది. సింగపూర్లో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు కనీసం ఆరు నెలల జైలు శిక్షతో పాటు 10వేల సింగపూర్ డాలర్లు జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి. అయితే ఇతడికి కేవలం రెండు వారాలే శిక్ష విధించడం అనేది ఆనందపడాల్సిన విషయం అనే పేర్కొనాలి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!