Singapore: దగ్గినందుకు జైలు శిక్ష.. అసలు కారణమేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Being Infected With Covid Indian origin man Coughing on Colleagues Jailed in Singapore: సింగపూర్ లో దగ్గినందుకు ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. అదేంటి దగ్గితేనే జైలు శిక్ష పడిందా అని అనుకుంటున్నారా? అయితే దాని చాలా పెద్ద కారణమే ఉంది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఎంత భయందోళనలు క్రియేట్ చేసిందో తెలిసిందే. దీని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇదిలా వుండగా తమిళ్ సెల్వం అనే వ్యక్తి సింగపూర్లోని ఓ కంపెనీలో క్లీనర్గా పని చేస్తున్నాడు. అయితే అతడికి 2021 లో ఆరోగ్యం పాడయ్యింది. అప్పట్లో కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉండటంతో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంట్లో అతడికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో టెస్ట్ ల అనంతరం అతడు ఇంటికి వెళ్లిపోకుండా తన ఆఫీసుకు వచ్చాడు. అయితే తనకి కోవిడ్ సోకింది సెలవు కావాలని తెలిపేందుకు అతడు ఆఫీసుకు వెళ్లాడు. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాని ఆఫీస్ సిబ్బంది సూచించాడు. అయినా తమిళ్ సెల్వం వెళ్లకుండా అక్కడక్కడే తిరిగాడు.
Also Read: Chiranjeevi on ANR : భారతీయ సినీ చరిత్రలోనే దిగ్గజ నటుడు.. ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
అంతేకాకుండా అక్కడ పలుమార్లు దగ్గాడు కూడా. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది చాలా ఇబ్బందికి గురవడంతో పాటు చాలా భయపడింది. అయితే, ఘటన తర్వాత ఎవరికీ కరోనా సోకలేదు కానీ.. తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అందుకే అక్కడ పనిచేసే ఉద్యోగుల్లో కొందరు అతనిపై ఫిర్యాదు చేశారు. ఆఫీసులో కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కూడా ఉన్నారని వారికి తమిళ్ సెల్వం నిర్లక్ష్యం వల్ల కరోనా సోకి ఉంటే పరిస్థితి తీవ్రంగా మారేదని, ఎంత చెప్పినా వినకుండా అతడు అక్కడే ఉన్నారని ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసుుకున్న పోలీసులు అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా అతడు పలుమార్లు దగ్గడం కనిపించింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అన్ని విషయాలను పరిశీలించిన కోర్టు 64 సంవత్సరాల తమిళ్ సెల్వంకు రెండు వారాల జైలు శిక్ష విధించింది. సదరు వ్యక్తి కరోనా నిబంధనలు పాటించకుండా.. సహోద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ శిక్ష విధించినట్లు పేర్కొంది. సింగపూర్లో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు కనీసం ఆరు నెలల జైలు శిక్షతో పాటు 10వేల సింగపూర్ డాలర్లు జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి. అయితే ఇతడికి కేవలం రెండు వారాలే శిక్ష విధించడం అనేది ఆనందపడాల్సిన విషయం అనే పేర్కొనాలి.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!