NTV Telugu Site icon

Teamindia: దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు భారత మహిళల జట్టులను ప్రకటించిన బీసీసీఐ..

Teamindia

Teamindia

దక్షిణాఫ్రికాతో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్‌ కు భారత మహిళల జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా.. డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరిస్తుంది. బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, స్పీడ్‌స్టర్ పూజా వస్త్రాకర్ మూడు స్క్వాడ్‌ లలో భాగంగా ఉన్నారు. అయితే వారు ఆడటం అనేది ఫిట్‌నెస్‌ పై ఆధారపడి ఉంటుంది.

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ తో సిరీస్ ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఒక టెస్ట్, ఆపై మూడు మ్యాచ్‌ ల T20 సిరీస్‌ తో ముగుస్తుంది. వన్డే సిరీస్‌కు ముందు, జూన్ 13న బెంగళూరులో బోర్డ్ ప్రెసిడెంట్స్ XI జట్టుతో విజిటింగ్ జట్టు వార్మప్ గేమ్ ఆడుతుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా బెంగళూరులో జరుగుతుంది. మిగిలిన సిరీస్ చెన్నైలో జరగనుంది. వార్మప్ గేమ్ తర్వాత మూడు వన్డేలు వరుసగా జూన్ 16, 19, 23 తేదీల్లో జరుగుతాయి. జూన్ 28 నుంచి జూలై 1 వరకు ఏకైక టెస్టు.. చివరగా మూడు టీ20లు వరుసగా జూలై 5, 7, 9 తేదీల్లో జరుగుతాయి.

ఈ ఒక్క టెస్టు గత ఏడు నెలల్లో భారత్‌కి మూడో టెస్టు మ్యాచ్‌ గా చెప్పవచ్చు. గత డిసెంబర్‌లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో భారత్‌ ఒక్కో టెస్టు ఆడింది. ఇరు జట్ల పై చక్కటి ఆటతీరుతో భారత్ విజేతగా నిలిచింది. ఈ పర్యటనలోని మూడు వన్డేలు 2022-2025 ICC మహిళల ఛాంపియన్‌ షిప్‌లో భాగంగా ఉన్నాయి. ఆతిథ్య భారత్‌తో పాటు ఛాంపియన్‌షిప్‌లోని మొదటి ఐదు జట్లు ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025కి నేరుగా అర్హత సాధిస్తాయి.

వన్డే సిరీస్ కోసం భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (డబ్ల్యుకె), దయాళన్ హేమలత, రాధా యాదవ్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ప్రియా పునియా.

టెస్ట్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమీమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (WK), ఉమా చెత్రీ (WK), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్ , రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్ *, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియా.

టీ20 సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, ఉమా చెత్రీ (డబ్ల్యుకె), రిచా ఘోష్ (డబ్ల్యుకె), జెమిమా రోడ్రిగ్స్ *, సజన సజీవన్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, ఆశా శోభన, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి. స్టాండ్‌బై గా సైకా ఇషాక్ ను ఎంపిక చేసారు.