Site icon NTV Telugu

Revanth Reddy: ముఖ్యమంత్రి నివాసంలో సీఎంను కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నేతలు నేడు ఉదయం కలిశారు. తెలంగాణ‌లో బీసీ సామాజిక‌, ఆర్థిక, కుల స‌ర్వే ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌న్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసారు బీసీ సంక్షేమ సంఘం నేతలు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు బీసీ సంక్షేమ సంఘం నేతలు.

Also Read: Konda Surekha-KTR: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్‌!

కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మరికొంతమంది బీసీ సంక్షేమ సంఘం నేతలు హాజరయ్యారు.

Also Read: Pakistan : పాకిస్తాన్‌లోని సింధ్‌లో భయం గుప్పిట్లో హిందువులు..ఎందుకో తెలుసా ?

Exit mobile version