Bank Holiday : రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా బ్యాంకులకు హాలీడే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Holiday : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చే వారం అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుంది. వచ్చే వారం జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమ ముహూర్తంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యరాజ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. అయోధ్యలోని రామమందిరప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా రాష్ట్రాలు జనవరి 22న సెలవు దినంగా ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్లో కూడా జనవరి 22ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. కాగా, జనవరి 22న ఉత్తరప్రదేశ్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయని వార్తలు వస్తున్నాయి.
జనవరి 22న అంటే సోమవారం బ్యాంకులు మూసివేయబడితే, వచ్చే వారం ఉత్తరప్రదేశ్లో రెండు రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. ఆదివారం కారణంగా జనవరి 21న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. రామమందిర ఉత్సవాల కారణంగా జనవరి 22న బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత, జనవరి 23 మంగళవారం, జనవరి 24 బుధవారం బ్యాంకుల్లో సాధారణ పనితీరు ఉంటుంది.
Also Read
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
Read Also:Iran’s strikes in Pakistan: “ఆత్మరక్షణ కోసమే”.. పాకిస్తాన్పై ఇరాన్ దాడి.. భారత్ స్పందన..
హజ్రత్ మహ్మద్ అలీ పుట్టినరోజు సందర్భంగా జనవరి 25, గురువారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత, రిపబ్లిక్ డే సందర్భంగా మరుసటి రోజు అంటే శుక్రవారం జనవరి 26న బ్యాంకులు మూసివేయబడతాయి. జనవరి 27 నెలలో నాల్గవ శనివారం, ఆ తర్వాత జనవరి 28 ఆదివారం సాధారణ సెలవు. ఈ విధంగా చూస్తే జనవరి 25 నుంచి జనవరి 28 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 21 నుండి వచ్చే ఎనిమిది రోజులలో బ్యాంకులు 2 రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి.. ఆరు రోజులు సెలవులు ఉంటాయి.
జనవరి 22న బ్యాంకులకు సెలవుపై సర్క్యులర్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం జనవరి 22న ఉత్తరప్రదేశ్లో అన్ని బ్యాంకులు మూతపడతాయని సర్క్యులర్లో చెప్పబడింది. అంటే ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా జనవరి 22న మూతపడనున్నాయి. తరచూ బ్యాంకులకు సెలవులు రావడంతో సామాన్యులు బ్యాంకింగ్ పనుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థిక పనులు చేయాల్సిన వారికి ఆన్లైన్ సౌకర్యాల సహాయం ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ATMని ఉపయోగించవచ్చు. డబ్బు బదిలీ చేయడానికి, మీరు UPI, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ని ఉపయోగించవచ్చు. బ్యాంకుల మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
Read Also:Railway Jobs 2024 : రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్లు..అర్హతలేంటంటే?
తాజావార్తలు
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!