Bandi Saroj Kumar: కేసులేస్తే వాళ్లు ఇంకా పెద్దోళ్లవుతారు.. సినిమా ఇండస్ట్రీపై బండి సరోజ్ సంచలన ట్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Saroj Kumar: తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు జరుగుతున్న ‘రివ్యూ మాఫియా’ చర్చలు, డిఫామేషన్ కేసులు, టికెట్ రేట్ల పెంపు అంశాలపై నటుడు, దర్శకుడు, రచయిత బండి సరోజ్ కుమార్ ఓ వైరల్ ట్వీట్తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. “రివ్యూయర్లపై డిఫామేషన్ కేసులు వేస్తే.. వాళ్ల ప్లాట్ఫాం మరింత పెద్దదవుతుంది. ఆర్టికల్ 19 ఇచ్చిన స్వేచ్ఛతో వాళ్లు మాట్లాడుతున్నారు. కోర్టు ఆదేశాలతో రేటింగ్స్ బ్లాక్ చేసినా.. ప్రజలు ఇప్పటికే నిజాయితీగా మాట్లాడే పాడ్కాస్ట్లు, ఛానెళ్ల వైపు వెళ్తున్నారు” అంటూ ఈ ట్వీట్లో బండి సరోజ్ స్పష్టంగా చెప్పారు.
READ ALSO: Revenge killing: పదేళ్ల క్రితం లేచిపోగా.. తల్లి మాజీ ప్రియుడిని హత్య చేసిన కొడుకు..
Also Read
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
ఇటీవల చిరంజీవి సినిమా నుంచి మొదలైన ‘రేటింగ్స్ బ్లాక్’ ఆదేశాలు, ‘రివ్యూ మాఫియా’పై చర్యలు.. ఇవన్నీ జనవరి 2026లోనే జరిగాయి. అయితే ఈ చర్యలు రివ్యూయర్ల గొంతును అణచివేయడమే కాకుండా.. వాళ్లకు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నాయని బండి సరోజ్ అభిప్రాయపడ్డారు. పెయిడ్ రివ్యూలు, ఫేక్ యూట్యూబ్ ఛానెళ్లను ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. “పెయిడ్ జర్నలిస్ట్ రివ్యూలు, ఫేక్ యూట్యూబ్ రివ్యూలను పట్టించుకోకండి. ప్రజలు ఇప్పుడు లక్షల వ్యూస్ వచ్చే జెన్యూన్ పాడ్కాస్ట్లు, డిస్కషన్లను ఇష్టపడుతున్నారు” అని స్పష్టం చేశారు. సినిమా ప్రేక్షకులు ఇప్పుడు నిజాయితీపై ఎక్కువ ఆధారపడుతున్నారని, మానిప్యులేటెడ్ కామెంటరీలపై నమ్మకం తగ్గిపోతోందని చెప్పారు. టికెట్ రేట్లే అసలు సమస్య.. కేసులు కాదని చెప్పారు. “రివ్యూయర్లపై కేసులు వేయడం కంటే.. టికెట్ రేట్లను రెగ్యులేట్ చేయండి. టికెట్ ధరలు పెరిగితే ఫుట్ఫాల్స్ తగ్గుతాయి. దీంతో హీరోల రెమ్యూనరేషన్, బాక్సాఫీస్ కలెక్షన్స్ రెండూ దెబ్బతింటాయి” అని హెచ్చరించారు. ప్రభుత్వ జీవోల ద్వారా టికెట్ రేట్లు ఎక్కువ చేయడం వల్ల సినిమా థియేటర్లకు ప్రేక్షకులు దూరమవుతున్నారని, దీర్ఘకాలంలో ఇది సినిమా రంగానికే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. “టికెట్ ధరలు అందుబాటులో ఉంటేనే.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అప్పుడే అందరి జీతాలూ, సినిమా కలెక్షన్స్ బాగుంటాయి” అని ఆయన చెప్పారు.
కవర్లు తీసుకొని పెయిడ్ రివ్యూలు రాసే కొంత మంది అమ్ముడుపోయిన జర్నలిస్టులను పబ్లిక్ ఎప్పుడో వెలివేసింది. వీళ్ల రివ్యూలను పక్కన పెట్టండి, ఇంటర్వ్యూలకి కూడా వ్యూస్ రావు. నిన్న మొన్న వచ్చిన podcast కుర్రాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. Because they discuss cinema. అలాగే యూట్యూబ్ లో…
— Bandi Saroj Kumar (@publicstar_bsk) February 4, 2026
READ ALSO: Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?
తాజావార్తలు
-
Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!