Bandi Saroj Kumar: కేసులేస్తే వాళ్లు ఇంకా పెద్దోళ్లవుతారు.. సినిమా ఇండస్ట్రీపై బండి సరోజ్ సంచలన ట్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Saroj Kumar: తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు జరుగుతున్న ‘రివ్యూ మాఫియా’ చర్చలు, డిఫామేషన్ కేసులు, టికెట్ రేట్ల పెంపు అంశాలపై నటుడు, దర్శకుడు, రచయిత బండి సరోజ్ కుమార్ ఓ వైరల్ ట్వీట్తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. “రివ్యూయర్లపై డిఫామేషన్ కేసులు వేస్తే.. వాళ్ల ప్లాట్ఫాం మరింత పెద్దదవుతుంది. ఆర్టికల్ 19 ఇచ్చిన స్వేచ్ఛతో వాళ్లు మాట్లాడుతున్నారు. కోర్టు ఆదేశాలతో రేటింగ్స్ బ్లాక్ చేసినా.. ప్రజలు ఇప్పటికే నిజాయితీగా మాట్లాడే పాడ్కాస్ట్లు, ఛానెళ్ల వైపు వెళ్తున్నారు” అంటూ ఈ ట్వీట్లో బండి సరోజ్ స్పష్టంగా చెప్పారు.
READ ALSO: Revenge killing: పదేళ్ల క్రితం లేచిపోగా.. తల్లి మాజీ ప్రియుడిని హత్య చేసిన కొడుకు..
Also Read
- PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
- Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
ఇటీవల చిరంజీవి సినిమా నుంచి మొదలైన ‘రేటింగ్స్ బ్లాక్’ ఆదేశాలు, ‘రివ్యూ మాఫియా’పై చర్యలు.. ఇవన్నీ జనవరి 2026లోనే జరిగాయి. అయితే ఈ చర్యలు రివ్యూయర్ల గొంతును అణచివేయడమే కాకుండా.. వాళ్లకు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నాయని బండి సరోజ్ అభిప్రాయపడ్డారు. పెయిడ్ రివ్యూలు, ఫేక్ యూట్యూబ్ ఛానెళ్లను ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. “పెయిడ్ జర్నలిస్ట్ రివ్యూలు, ఫేక్ యూట్యూబ్ రివ్యూలను పట్టించుకోకండి. ప్రజలు ఇప్పుడు లక్షల వ్యూస్ వచ్చే జెన్యూన్ పాడ్కాస్ట్లు, డిస్కషన్లను ఇష్టపడుతున్నారు” అని స్పష్టం చేశారు. సినిమా ప్రేక్షకులు ఇప్పుడు నిజాయితీపై ఎక్కువ ఆధారపడుతున్నారని, మానిప్యులేటెడ్ కామెంటరీలపై నమ్మకం తగ్గిపోతోందని చెప్పారు. టికెట్ రేట్లే అసలు సమస్య.. కేసులు కాదని చెప్పారు. “రివ్యూయర్లపై కేసులు వేయడం కంటే.. టికెట్ రేట్లను రెగ్యులేట్ చేయండి. టికెట్ ధరలు పెరిగితే ఫుట్ఫాల్స్ తగ్గుతాయి. దీంతో హీరోల రెమ్యూనరేషన్, బాక్సాఫీస్ కలెక్షన్స్ రెండూ దెబ్బతింటాయి” అని హెచ్చరించారు. ప్రభుత్వ జీవోల ద్వారా టికెట్ రేట్లు ఎక్కువ చేయడం వల్ల సినిమా థియేటర్లకు ప్రేక్షకులు దూరమవుతున్నారని, దీర్ఘకాలంలో ఇది సినిమా రంగానికే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. “టికెట్ ధరలు అందుబాటులో ఉంటేనే.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అప్పుడే అందరి జీతాలూ, సినిమా కలెక్షన్స్ బాగుంటాయి” అని ఆయన చెప్పారు.
కవర్లు తీసుకొని పెయిడ్ రివ్యూలు రాసే కొంత మంది అమ్ముడుపోయిన జర్నలిస్టులను పబ్లిక్ ఎప్పుడో వెలివేసింది. వీళ్ల రివ్యూలను పక్కన పెట్టండి, ఇంటర్వ్యూలకి కూడా వ్యూస్ రావు. నిన్న మొన్న వచ్చిన podcast కుర్రాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. Because they discuss cinema. అలాగే యూట్యూబ్ లో…
— Bandi Saroj Kumar (@publicstar_bsk) February 4, 2026
READ ALSO: Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?
తాజావార్తలు
-
Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
-
IPL 2026 Playoffs Scenario: ప్లేఆఫ్స్ రేసు మరింత హీట్.. టాప్లో ఆర్సీబీ.. 8 జట్ల అవకాశాలు ఇలా!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్డమ్ ఉరికే రాలేదు
-
Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’
ట్రెండింగ్
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత