Jet Fuel Hike : ఒకవైపు ప్రభుత్వం ఆర్థిక సర్వేలో వస్తువుల ధరలు తగ్గుతాయని అంచనా వేస్తోంది. మరోవైపు, ఫిబ్రవరి నెలలో జెట్ ఇంధన ధరలు 5 శాతానికి పైగా పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ఇది ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల విమాన ఛార్జీలు పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కుంభమేళా వంటి భారీ ఈవెంట్స్ కారణంగా విమాన ప్రయాణ ఖర్చు పెరిగింది.
దేశీయ విమానాలకు ఇంధన ధరల పెరుగుదల
ఫిబ్రవరి 1న జెట్ ఇంధన ధరల్లో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది.
* న్యూఢిల్లీ: రూ. 5.61 పెరిగి, కొత్త ధర రూ.95,533.72
* కోల్కతా: రూ. 5.27 పెరిగి, కొత్త ధర రూ.97,961.62
* ముంబై: రూ. 5.68 పెరిగి, కొత్త ధర రూ.89,318.90
* చెన్నై: రూ. 5.62 పెరిగి, కొత్త ధర రూ.98,940.19
Read Also:Chandoo Mondeti : ‘కార్తికేయ-3’ గురించి అప్డేట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటి
అంతర్జాతీయ విమానాలకు ఇంధన ధరల పెరుగుదల
అంతర్జాతీయ మార్గాల్లో సైతం ఇంధన ధరలు పెరిగాయి.
* న్యూఢిల్లీ: 5.09% పెరిగి బ్యారెల్కు $854.15
* కోల్కతా: 4.83% పెరిగి బ్యారెల్కు $854.15
* ముంబై: 5.05% పెరిగి బ్యారెల్కు $892.68
* చెన్నై: 5.10% పెరిగి బ్యారెల్కు $848.89
విమాన ఛార్జీలు పెరుగుతాయా?
విమానయాన కంపెనీల వ్యయాలలో 40శాతం వరకు జెట్ ఇంధనానికి వెచ్చించాల్సి వస్తుంది. ఈ ధరల పెరుగుదల వల్ల, విమానయాన సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను సమతుల్యం చేసుకునేందుకు టికెట్ ధరలను పెంచే అవకాశముంది. ఇప్పటికే కుంభమేళా వంటి పెద్ద కార్యక్రమాలు, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు విమాన ఛార్జీలపై ప్రభావం చూపుతున్నాయి.
Read Also:New Land Registration Charges: ఏపీలో పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. నేటి నుంచే అమలు..