Damodara Raja Narasimha : ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం..
- ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారు
- మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నాము
- యోగా.. ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదు : మంత్రి దామోదర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodara Raja Narasimha : 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 628 మంది పార్ట్ టైమ్ యోగా ఇన్స్ట్రక్టర్లకు మంత్రి అపాయింట్మెంట్ లెటర్లు అందించారు.. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం అని, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారన్నారు. మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నామని, యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదన్నారు మంత్రి దామోదర. మానవాళికి సంబంధించిన అంశం. మానవశరీరం, జ్ఞానం, మనస్సుకు సంబంధించిన అంశమన్నారు. ఇప్పుడిప్పుడే దీని ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, పిల్లలకు దీన్ని నేర్పించాలన్నారు మంత్రి దామోదర. యోగా, ఆయుర్వేదను గ్రామాల్లోకి తీసుకెళ్లాలని, యోగా వల్ల కలిగే లాభాలు ఏంటో ప్రజలకు వివరించి, వారికి అవగాహన కల్పించాలన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా.
Delivery Agent : బతుకు పోరాటం.. రెండు చేతులు లేకున్నా.. బండి నడుపుతున్న జొమాటో డెలివరీ బాయ్
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
అంతేకాకుండా.. ఆయుష్ డైరెక్టరేట్ను సాంక్షన్ చేస్తామని, హైదరాబాద్, వరంగల్లోని కాలేజీల్లో ఆయుష్ యూజీ, పీజీ సీట్ల సంఖ్యను పెంచుతామని ఆయన వెల్లడించారు. స్టూడెంట్ల కోసం కొత్త హాస్టల్ భవనాలను నిర్మిస్తామని, వారం రోజుల్లో విద్యార్థుల స్టైఫండ్ చెల్లిస్తామన్నారు. స్టైఫండ్ పెంపు అంశాన్ని పరిశీలిస్తామని, ఇంకో 214 మంది యోగా ఇన్స్ట్రక్టర్లను త్వరలో నియమిస్తామన్నారు. ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదను గౌరవిస్తోంది. ఆదరిస్తోంది. మనం కూడా ఈ విభాగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం హెల్త్ సెక్రటరీ క్రిస్టినా 1935లో ఆయుర్వేద కాలేజీ ఏర్పడిందని, 421 ఆరోగ్య మందిర్స్లో యోగా టీచర్లను నియమించామన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లలకు యోగా అలవాటు చేయాలని, ఆరోగ్య మందిర్స్లో యోగా ఇన్స్ట్రక్టర్లు ఉచితంగా యోగా నేర్పిస్తారన్నారు.
Kapil Dev – Chandrababu: ఏపీ ముఖ్యమంత్రితో కపిల్ దేవ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!
తాజావార్తలు
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!