NTV Telugu Site icon

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

Ap Rape

Ap Rape

మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో ఐదేళ్ల అమాయక బాలికపై అత్యాచారం జరిగిన జుగుప్సాకరమైన ఘటన చోటుచేసుకుంది. పొరుగున ఉంటున్న 17 ఏళ్ల మైనర్ ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి బాలికకు కడుపునొప్పి రావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం సోయెట్ కాలా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

READ MORE: Road Accident : ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

పోలీసుల కథనం ప్రకారం.. బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఆ అబ్బాయి ఆమెను ప్రలోభపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు మైనర్ బాలుడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడని సోయెట్ కాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ యశ్వంత్ రావ్ గైక్వాడ్ వెల్లడించారు. అనంతరం రాత్రి కడుపునొప్పి రావడంతో బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసిందని చెప్పారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. బాలికపై వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని గైక్వాడ్ తెలిపారు. మైనర్ బాలుడిపై ఐపీసీ, పోక్సో చట్టం, లైంగిక నేరాల నుంచి చిన్నారుల రక్షణ కోసం రూపొందించిన చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరారు.