Airfare Price Hike: పెరిగిన విమాన ఇంధన ధరలు.. పండుగల సీజన్లో ప్రయాణికులకు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airfare Price Hike: మరికొద్ది రోజుల్లో భారత్లో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రవాణా కోసం విమానాలను ఉపయోగిస్తారు. పండుగ సీజన్ ప్రారంభం కాకముందే చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) పెద్ద షాక్ ఇచ్చాయి. ఎయిర్ ఫ్యూయల్ ఖరీదైనదిగా చేశాయి. దీని తర్వాత రాజధాని ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటర్ రూ.1,18,199.17కి చేరింది. ఇక్కడ గత నెలతో పోలిస్తే 5.50 శాతం పెరుగుదల నమోదైంది. కొత్త ధరలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వచ్చాయి. ముడిచమురు ధర పెరిగిన తర్వాత ఏటీఎఫ్ ధర పెరగడం గమనార్హం. సెప్టెంబర్ 2023లో ఢిల్లీలో ATF ధర లీటరుకు రూ. 1.12 లక్షలకు విక్రయించబడింది.
మెట్రో నగరాల్లో ఏటీఎఫ్ ధర
ఢిల్లీ – కిలోలీటర్కు రూ. 1,18,199.17
కోల్కతా- కిలోలీటర్కు రూ.1,26,697.08
ముంబై- కిలోలీటర్కు రూ.1,10,592.31
చెన్నై- కిలోలీటర్కు రూ.1,22,423.92
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Read Also:MLA Seethakka: విధి లేని పరిస్థితిలోనే కోర్టును ఆశ్రయించా.. ఎమ్మెల్యే సీతక్క హాట్ కామెంట్స్
సెప్టెంబర్ 1న కూడా పెరిగిన ధర
సెప్టెంబరు 1న కూడా ఏటీఎఫ్ ధరల్లో పెరుగుదల నమోదైంది. ఆ తర్వాత పండుగ సీజన్ ప్రారంభానికి ముందు ఎయిర్లైన్స్ కంపెనీల ఆందోళన పెరిగింది. అక్టోబరు నెలలో వాయు ఇంధనం ధర పెరిగింది. ఎయిర్ ఫ్యూయల్ ధర వరుసగా నాలుగు సార్లు పెరగడం గమనార్హం. జూలై 1న కూడా చమురు కంపెనీలు ఏటీఎఫ్ ధరను 1.65 శాతం పెంచాయి. జెట్ ఇంధనం ధర పెరగడానికి ప్రధాన కారణం ముడి చమురు ధర పెరుగుదల. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా పెరిగి 97 డాలర్లకు చేరుకుంది. జూలై నుండి ఇప్పటివరకు ముడి చమురు ధర 30 శాతం పెరిగింది. సెప్టెంబర్లోనే ఏకంగా 15 శాతం పెరిగింది.
అక్టోబరు ప్రారంభం కావడంతో మరికొద్ది రోజుల్లో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. నవరాత్రి, దసరా, దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున ఇళ్లకు వెళ్తారు. విమాన ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమాన ఛార్జీలపై కూడా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో విమానయాన సంస్థలు తమ కస్టమర్లపై ఈ భారాన్ని మోపవచ్చు. పండుగ సీజన్లో విమాన ప్రయాణం ఖరీదు కావొచ్చు.
Read Also:Asian Games 2023: భారత్కు మరో 3 పతకాలు.. గోల్ఫ్లో మొదటి పతకం!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!