Assembly Elections 2023: ఈసీ విలేకరుల సమావేశం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటన
Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విలేకరుల సమావేశాన్ని ప్రారంభించారు. ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు అందరం ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఆరు నెలల తర్వాత ఇక్కడ కలుస్తున్నామన్నారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీల ప్రకటన చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రాల ఎన్నికల తేదీలను కమిషన్ ప్రకటించనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ పీసీలో ఉన్నారు. ఈసీ అధికారులు మొత్తం ఐదు రాష్ట్రాల్లో పర్యటించారని, రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. రాజకీయ పార్టీల సూచనలను కూడా తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.
Also Read
- West Bengal Results 2026: బెంగాల్లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..
- Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!
- Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
- Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8.2 కోట్ల మంది పురుష ఓటర్లు, 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు, 60.2 లక్షల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. మిజోరంలో మొత్తం 8.52 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 2.03 కోట్ల మంది, మధ్యప్రదేశ్లో 5.6 కోట్ల మంది, రాజస్థాన్లో 5.25 కోట్ల మంది, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ఓటింగ్ కోసం 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు ఓటు వేసే సౌకర్యం ఉంటుంది. పోలింగ్ బూత్ 2 కిలోమీటర్ల దూరంలో ఉండదు. పార్టీలు అక్టోబర్ 31లోగా విరాళాల గురించి సమాచారం ఇవ్వాలి. అప్పుడే ఆదాయపు పన్నులో మినహాయింపు లభిస్తుందని ఆయన చెప్పారు. కొన్ని పార్టీలు ఇప్పటికే తమ నివేదికలను ఆన్లైన్లో సమర్పించడం ప్రారంభించాయి. అక్రమ నగదు, మద్యం, ఉచిత వస్తువులు, మాదకద్రవ్యాల సరిహద్దు తరలింపులను తనిఖీ చేసేందుకు ఐదు రాష్ట్రాల్లో 940కి పైగా అంతర్-రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేయనున్నారు.వీటిని రాష్ట్ర పోలీసులు, వివిధ భద్రతా సంస్థలు నిర్వహిస్తాయి. వృద్ధులకు ఇంటి నుండే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తారు.
మిజోరంలో ముందుగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 7న మిజోరాంలో ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. రాజస్థాన్ లో నవంబర్ 23న తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహణ ఉంటుంది. అనంతరం డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 17,734 మోడల్ పోలింగ్ స్టేషన్లు, 621 పోలింగ్ స్టేషన్ల నిర్వహణ బాధ్యత పీడబ్ల్యూడీ సిబ్బందిదేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 8,192 పోలింగ్ కేంద్రాల్లో మహిళలు బాధ్యతలు చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
PSL 2026 Final: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. కెప్టెన్గా తొలి పీఎస్ఎల్ ట్రోఫీ అందుకున్న బాబర్ ఆజం
-
Michael: వసూళ్ల వర్షం కురిపిస్తున్న మ్యూజికల్ డ్రామా ‘మైఖేల్’..!
-
West Bengal Results 2026: బెంగాల్లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..
-
IPL 2026 Orange Cap Update: ఆరెంజ్ క్యాప్ రేస్.. విరాట్ కోహ్లీ టాప్-5 నుంచి ఔట్.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ!
-
Sai Sudharsan: 13 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టిన సాయి సుదర్శన్.. క్రిస్ గేల్ను వెనక్కి నెట్టిన టీమిండియా కుర్రాడు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!