AP Weather Forecast: ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. రెండు రోజులు వర్షాలు, వడగాలులు!
- ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు
- ఏపీలో రెండు రోజులు వర్షాలు, వడగాలులు
- పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఒకవైపు మేఘావృత వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగి.. వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. దక్షిణ కోస్తాంధ్ర–పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంగళవారం (ఏప్రిల్ 7) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
మరోవైపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వడగాలుల హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోని మనుబోలు, చిల్లకూరు, గుడూరు ప్రాంతాల్లో, తిరుపతి జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల ప్రజలు అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని, లేదంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: TN 2026 Movie: ‘టీఎన్ 26’ సినిమా కాదు, పొలిటికల్ అటాక్.. విజయ్ అభిమానుల ఫైర్!
నేడు రాష్ట్రంలో పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురంలో 42 డిగ్రీల సెల్సియస్, కడపలో 41.9 డిగ్రీలు, మార్కాపురంలో 40.7 డిగ్రీలు, నంద్యాలలో 40.6 డిగ్రీలు నమోదయ్యాయి. నెల్లూరు 40.3 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా 40.1 డిగ్రీలు, కర్నూలులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా ఉండాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీరు ఎక్కువగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?