SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..
- ఏపీ SSC బోర్డు కీలక నిర్ణయం..
- తప్పులు దొర్లిన ప్రశ్నలకు మార్కులు..
- మొత్తం 7 మార్కులు కలిపేందుకు నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) బోర్డు ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇటీవల జరిగిన వార్షిక పరీక్షల్లో కొన్ని ప్రశ్నల విషయంలో తలెత్తిన అస్పష్టతను పరిగణనలోకి తీసుకున్న బోర్డు, విద్యార్థులకు మొత్తం 7 మార్కులను గ్రేస్ మార్కులుగా కలపాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లోని పొరపాట్ల వల్ల విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ అదనపు మార్కులను కేటాయిస్తున్నారు.
నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా.. ఇంగ్లీష్ పేపర్లో 5 మార్కులు, హిందీ పేపర్లో 2 మార్కులు కలపనున్నారు. ఈ సందిగ్ధ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులందరికీ ఈ ప్రయోజనం చేకూరుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు (DEOs) , స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన సుమారు 6.40 లక్షల మంది విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడమే కాకుండా, వారికి మెరుగైన గ్రేడింగ్ వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
- YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
Also Read:Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..
అయితే.. మరికొన్ని ప్రశ్నల్లో కూడా తప్పులు దొర్లాయని తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తిని బోర్డు సున్నితంగా తిరస్కరించింది. ఆ ప్రశ్నలు విద్యార్థుల మేధస్సును పరీక్షించే కోణంలోనే ఇచ్చామని, వాటిలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని అధికారులు వివరణ ఇచ్చారు. కాగా, ఏప్రిల్ 6 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం (Spot Valuation) ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి, ఏప్రిల్ చివరి నాటికి తుది ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది.
తాజావార్తలు
-
Director Teja: డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. “బుర్రలేని దర్శకులతో పని చేయడమే నా అదృష్టం!”
-
Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!