Site icon NTV Telugu

YSRCP MLCs: కొత్తగా ఎన్నికైన 8 మంది వైసీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..

Oath Taking Ceremony

Oath Taking Ceremony

YSRCP MLCs: కొత్తగా ఎన్నికైన 8 మంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులు ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రమాణస్వీకారం చేయించారు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు… అసెంబ్లీ ప్రాంగణంలో ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు.. శాసన మండలి సభ్యులుగా రామ సుబ్బారెడ్డి, మేరుగ మురళీధర్, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్, కుడిపూడి సూర్యనారాయణ రావు, నర్తు రామారావు, సుబ్రహ్మణ్యం సిపాయి, డా. అల్లంపూర్ మధుసూదన్‌ ప్రమాణస్వీకారం చేశారు. కాగా, స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు.

Read Also: KTR : కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్‌

Exit mobile version