AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో అమరావతిలో జరిగిన సమావేశంలో చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సాధ్యమైనంత సాయంగా నిలుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా పలు కీలక ప్రకటనలు చేయగా, ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ సీఎం నిర్ణయాలపై తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 12వ పీఆర్సీ (PRC) నియామకానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 1-7-2024, 1-1-2025 కి సంబంధించిన రెండు డీఏలను (DA) 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కాబట్టి ఈ డీఏలు అక్టోబర్ నెల జీతాల నుంచి ఉద్యోగులకు అందుతాయి.
Also Read
- South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
- Ind Vs Pak: పాకిస్తాన్పై టీమిండియా ఆధిపత్యం.. 17 మ్యాచ్ల్లో 14 సార్లు భారత్దే గెలుపు.. నేడు మరో సమరం..
- Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
లీవుల చెల్లింపులకు సంబంధించి, 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్స్ బకాయిలను వచ్చే సంక్రాంతి నుంచి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ఆమోదం తెలిపారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఈ దసరాకే ఒక అడిషనల్ సరెండర్ లీవ్ చెల్లించాలని నిర్ణయించారు.
పింఛనుదారులకు ఊరటనిస్తూ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ రిస్టోరేషన్ కు ప్రభుత్వం అంగీకరించింది. దీనిని జనవరి 2027 నుంచి అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా 70 ఏళ్లు దాటిన పింఛనుదారులకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది.
ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ను (EHS) పూర్తిగా స్ట్రీమ్లైన్ చేయనున్నారు. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల నిధులను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ కీలక నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ.2,880 కోట్ల అదనపు భారం పడనుంది.
తాజావార్తలు
-
AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
-
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
-
South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
-
APFDC Chairman : ఏపీలో 3 నెలల్లో 400 థియేటర్లు బంద్.. టికెట్ రేట్ల పెంపుపై అత్యాశ వద్దు
-
Ind Vs Pak: పాకిస్తాన్పై టీమిండియా ఆధిపత్యం.. 17 మ్యాచ్ల్లో 14 సార్లు భారత్దే గెలుపు.. నేడు మరో సమరం..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!