CM chandrababu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే!

  • నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
  • కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం చంద్రబాబు
  • ఎల్లుండి ఉదయం అమరావతికి
Cm Chandrababu

Cm Chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 5,6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి.. విజయవాడ పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలను ఏపీ సీఎం కలవనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ఓ వివాహ వేడుకకు చంద్రబాబు హాజరుకానున్నారు.

సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకుంటారు. గురువారం ఉదయం 10.30 గంటలకు గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు మధ్యహ్నం 1.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 5.30కు భారత్ మండపంలో జరిగే ఒక టీవీ కాంక్లేవ్ లో చంద్రబాబు పాల్గొంటారు. రేపు రాత్రి ఢిల్లీలోనే బస చేసి.. ఎల్లుండి ఉదయం బయలుదేరి అమరావతికి వస్తారు.