NTV Telugu Site icon

AP BJP : నేడు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర విసృతస్థాయి సమావేశం

Purandeswari

Purandeswari

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వా తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన నేడు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. రాజమహేంద్రవరం లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, జాతీయ నేతలు శివప్రకాశ్ జీ, అరుణ్ సింగ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇతర నేతలు పాల్గొంటారని సామించి శ్రీనివాస్ చెప్పారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ..”గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ కేంద్రంగా తిరుమల శ్రీవారి ఆస్తులు, నిధులు దుర్వినియోగం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని జగన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. వైసీపీ అభ్యర్థిని గెలుపించుకోవాడనికి తిరుమల నిధులను అప్పటి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వాడుకున్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వీర విధేయులకు మాత్రమే తిరుమల కొండ మీద షాపులు కేటాయించారన్నారు.