హైదరాబాద్లోని అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా సాంకేతిక రంగంలో మరో మెట్టు పైకి ఎక్కింది. కాలేజీ ఛైర్మన్ అక్కినేని నాగార్జున, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కలిసి మంగళవారం నాడు అత్యాధునిక ‘డాల్బీ అట్మాస్ 7.1.4 హెచ్ఈ మిక్స్’ స్టూడియోను ప్రారంభించారు. సినిమా రంగంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చేందుకు ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. సినిమాకు ప్రాణం పోసేది మ్యూజిక్ మాత్రమే అని, అందుకే తమ విద్యార్థులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈ కొత్త స్టూడియో వల్ల స్టూడెంట్స్ ప్రపంచ స్థాయి ఆడియో మిక్సింగ్ పనులను ఇక్కడే నేర్చుకోవచ్చు.
Also Read : Kamal Haasan : కమల్ హాసన్ వ్యాఖ్యలపై కస్తూరి కౌంటర్.. “ఆయన ఏం చెప్పారో ఎవరికైనా అర్థమైందా?”
ఈ స్టూడియోలో ఏర్పాటు చేసిన డెమోను చూసి కీరవాణి ముగ్ధులయ్యారు. అనంతరం ఆయన విద్యార్థులతో ముచ్చటిస్తూ.. సౌండ్ డిజైనింగ్లో ఉండే మెళకువలను వివరించారు. “సౌండ్ అనేది సినిమాకు ఆత్మ లాంటిది. కరెక్ట్ సౌండ్ ఉంటేనే సినిమాలో ఎమోషన్స్ బాగా పండుతాయి” అని ఆయన అన్నారు. ఇలాంటి వరల్డ్ క్లాస్ సౌకర్యాలు స్టూడెంట్స్ దగ్గరకు రావడం వల్ల వారిలో కొత్త ఆలోచనలు పుడతాయని, సినిమా మేకింగ్లో వారు అద్భుతాలు చేయవచ్చని కీరవాణి ఆకాంక్షించారు. ఈ అత్యాధునిక సౌకర్యం అందుబాటులోకి రావడంతో సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకునే విద్యార్థులకు అన్నపూర్ణ కాలేజీ ఒక కేరాఫ్ అడ్రస్గా నిలవనుంది.