Site icon NTV Telugu

Amit Shah: రానున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అమిత్‌ షా కీలక నిర్ణయం..

Amit Shah

Amit Shah

Amit Shah: కర్ణాటకలో 2023లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఎన్నికలకు ముందు కేఎస్ ఈశ్వరప్ప, రమేష్ జార్కిహోళి వంటి అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణకు కేంద్ర మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కర్ణాటకలో మేలో జరగనున్న 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అవసరమైన అట్టడుగు స్థాయి సన్నాహాలను చర్చించేందుకు కర్ణాటకలోని బూత్ స్థాయి కార్యకర్తలతో కీలక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర, బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జ్ అరుణ్ సింగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, జాతీయ కార్యదర్శి సీటీ రవి వంటి ఇతర పార్టీ నాయకులు హాజరయ్యారు.

జనతాదళ్ (సెక్యులర్), కాంగ్రెస్‌లకు సాంప్రదాయక కోటగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలోకి ప్రవేశించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం, మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడతో వేదిక పంచుకున్న అమిత్ షా, దాదాపు 14 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన ఓల్డ్ మైసూరు ప్రాంతంలోని మాండ్య జిల్లా మద్దూరు తాలూకాలో మెగా డెయిరీ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఆ వేదిక పైనుంచి అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 2013 నుంచి 2018 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య ఇప్పుడు నిషేధించబడిన ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేసులను ఉపసంహరించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పీఎఫ్‌ఐని నిషేధించారని, ఆ పార్టీ నేతలను అరెస్టు చేశారని అన్నారు.

మాండ్యాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆరు జేడీ(ఎస్), బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. జేడీ(ఎస్‌)-కాంగ్రెస్‌కు చాలా అవకాశాలు ఇచ్చారని, అవి మారుతూ ఉన్నాయని, ఈసారి మాండ్య, మైసూరులో కమలం వికసిస్తుందని, మెజారిటీ సాధిస్తామని చెప్పారు. కర్ణాటక జనాభాలో కనీసం 15 శాతం ఉన్న, లింగాయత్‌ల తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న వొక్కలిగ కమ్యూనిటీ ఉన్న ప్రాంతంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పటివరకు బీజేపీకి దూరంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో వారిదే ఆధిపత్యం. ఈ ప్రాంతంలో మాండ్య, మైసూరు, హాసన్, తుమకూరు, చామరాజనగర్, బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబల్లాపూర్ వంటి జిల్లాలు ఉన్నాయి.

Rahul Gandhi: బీజేపీ నా గురువు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

అమిత్ షా ఆదిచుంచనగిరి మఠం అధిపతి నిర్మలానందనాథ స్వామిజీని కలిశారు. పాత మైసూరు ప్రాంతంలోని ప్రభావవంతమైన మఠం ముఖ్యంగా వొక్కలిగ కమ్యూనిటీ వారు ఎంతో గౌరవిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే అది ఢిల్లీ ఏటీఎం అవుతుందని, జేడీ(ఎస్) గెలిస్తే అది కుటుంబ ఏటీఎం అవుతుందని అమిత్ షా ప్రత్యర్థులిద్దరిపై విరుచుకుపడ్డారు. 2024లో అయోధ్య రామ మందిరాన్ని తెరవడం, కేదర్‌నాథ్, బద్రీనాథ్, కాశీ విశ్వనాథ్ పుణ్యక్షేత్రాల అభివృద్ధి వంటి ఇతర ముఖ్య అంశాలపై ప్రసంగిస్తూ మాండ్యాలో బీజేపీ సంకల్ప యాత్రకు తరలివచ్చిన జనాన్ని గెలవడానికి షా ప్రయత్నించారు.

Exit mobile version