Andhra Pradesh: ఏపీలో రిజిస్ట్రేషన్ విలువల సవరణ.. సర్క్యూలర్ జారీ
- ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ విలువలు సవారిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్
- ఎల్లుండి నుంచి ఏపీలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణ
- మార్కెట్ విలువకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ విలువలు సవారిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. ఎల్లుండి (శనివారం) నుంచి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నారు. మార్కెట్ విలువకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు భారీగా క్యూ కడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో తగ్గుదల.. కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగా.. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సిసోడియా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి ఆదేశాలు ఇచ్చారు.
Read Also: US Mid Air Accident: విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మృతి.. ప్రకటించిన యూఎస్..
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
ఇదిలా ఉంటే.. ఏపీలో రిజిస్ట్రేషన్ సర్వర్లు మొరాయించాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఓపెన్ కావడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలుకానుండటంతో రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనం తాకిడి పెరిగింది. దీంతో.. సీఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కావడం లేదని జనం చెబుతున్నారు. అయితే రేపు ఒక్కరోజే సమయం ఉండటంతో.. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు.
Read Also: HMPV Virus: దేశంలో మరో HMPV కేసు.. 4 ఏళ్ల బాలుడిలో వైరస్ నిర్ధారణ..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 1నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే మంగళవారం, బుధవారాల్లో అమావాస్య రావడంతో ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తారు. ఇంతకుముందు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల ధరలు తగ్గితే.. మరికొన్ని చోట్ల పెరగనున్నట్లు వెల్లడించారు. కాగా.. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం