బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరోసారి వార్తల్లో నిలిచారు. అది కూడా ఆమె ఏదైనా కొత్త సినిమా అనౌన్స్మెంట్తోనో, అవార్డుతోనో కాదు.. ఒక పాకిస్థానీ క్లాతింగ్ బ్రాండ్ ప్రచారంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. పాకిస్థాన్కు చెందిన ఒక ప్రముఖ డ్రెస్ బ్రాండ్ను అలియా ప్రమోట్ చేస్తున్నట్లు కొన్ని ఫొటోలు వైరల్ కావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అసలు అలియా నిజంగానే ఆ బ్రాండ్కు సైన్ చేసిందా? లేక దీని వెనుక ఏదైనా మాయ ఉందా? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అయితే అసలు నిజం ఎంటంటే..
Also Read : Gayatri Gupta: ఇంట్లో 10 కత్తులు దాచుకున్నా.. క్యాస్టింగ్ కౌచ్పై గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్!
పాకిస్థాన్కు చెందిన ‘వజేషా అఫీషియల్’ (Wajayesha Official) అనే బ్రాండ్ తన ఇన్స్టాగ్రామ్లో అలియా భట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో అలియా వివిధ రంగుల సిల్క్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించింది. అయితే, ఈ ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఇవి నిజమైన ఫోటో షూట్ ఫొటోలు కావు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా ఫోటోషాప్ సాయంతో సృష్టించిన ఫేక్ ఫొటోలు. 2024లో లోరియల్ పారిస్ ర్యాంప్ వాక్, అలాగే 2026 మిలాన్ ఫ్యాషన్ వీక్లో అలియా చేసుకున్న మేకప్, హెయిర్ స్టైల్స్ను ఈ బ్రాండ్ డిజిటల్గా కాపీ చేసి, తమ దుస్తులపైకి మార్చింది. కాగా ఈ మోసాన్ని గమనించిన నెటిజన్లు ఈ బ్రాండ్ పై మండి పడుతూ..
‘అసలు ఈ విషయం అలియాకు తెలుసా? ఆమె మీపై కేసు వేస్తుంది’ అని హెచ్చరించగా.. ఆ బ్రాండ్ ఏమాత్రం భయం లేకుండా ‘ఆమె వేయదు, ఈ పోస్ట్ను వైరల్ చేయండి ఆమెకే తెలుస్తుంది’ అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చింది. స్టార్ హీరోయిన్ల క్రేజ్ను వాడుకుంటూ, వారికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఇలా AI సాయంతో బ్రాండ్ ఇమేజ్ను వాడుకోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలియా భట్ టీమ్ ఈ విషయంపై లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
