Akshaya Tritiya 2025: నేడే అక్షయ తృతీయ.. బంగారం కొనడానికి ఇదే శుభ సమయం!
- నేడే అక్షయ తృతీయ
- బంగారం కొనడానికి ఇదే శుభ సమయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైశాఖ శుక్ల పక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అంటారు. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు వారి వారి రాశిచక్రంలో ఉచ్ఛస్థితిలో ఉంటారు. కాబట్టి సూర్య చంద్రుల ఆశీర్వాదాల ఫలం శాశ్వతంగా ఉంటుంది. అక్షయ అంటే క్షయం కానిది అని అర్థం. ఈ రోజు చేసిన పని, ధాన ధర్మాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు విలువైన వస్తువులను కొనుగోలు చేసి, చాలా వస్తువులను దానం చేస్తారు. ముఖ్యంగా బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటారు. అక్షయ తృతీయను జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. మరి నేడు బంగారం కొనడానికి శుభ సమయం ఎప్పుడుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:Anakapalle: పెళ్లై ఏడాది గడవక ముందే ఘోరం.. అసలు ఏమైందంటే?
Also Read
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
హిందూ క్యాలెండర్ ప్రకారం.. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి ఏప్రిల్ 29న అంటే ఈరోజు సాయంత్రం 5:31 గంటలకు ప్రారంభమైంది. ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, అక్షయ తృతీయను ఏప్రిల్ 30 బుధవారం జరుపుకుంటారు. పూజ చేయడానికి శుభ సమయం ఉదయం 5:41 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
Also Read:Allu Arjun : బన్నీ-అట్లీ మూవీ.. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తోందే..
బంగారం కొనడానికి అనుకూలమైన సమయం
ఏప్రిల్ 30న ఉదయం 5:41 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు బంగారం కొనడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. బంగారం కొనలేకపోతే బంగారం పూత పూసిన వస్తువులను కొనండి. ఈ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వీటిని కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇందులో ఇత్తడి పాత్రలు, అలాగే పసుపు ఆవాలు కొనడం కూడా చాలా శుభప్రదం. ఉదయం చల్లటి నీటితో స్నానం చేసి విష్ణువు, లక్ష్మీని పూజించాలి. తెల్లని పువ్వులు అర్పించి, విష్ణువు, లక్ష్మీ దేవి మంత్రాలను జపించాలి. తరువాత ఏదైనా దానం చేస్తే పుణ్యం వస్తుందంటున్నారు పండితులు.
తాజావార్తలు
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!