Akshaya Tritiya 2025: నేడే అక్షయ తృతీయ.. బంగారం కొనడానికి ఇదే శుభ సమయం!
- నేడే అక్షయ తృతీయ
- బంగారం కొనడానికి ఇదే శుభ సమయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైశాఖ శుక్ల పక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అంటారు. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు వారి వారి రాశిచక్రంలో ఉచ్ఛస్థితిలో ఉంటారు. కాబట్టి సూర్య చంద్రుల ఆశీర్వాదాల ఫలం శాశ్వతంగా ఉంటుంది. అక్షయ అంటే క్షయం కానిది అని అర్థం. ఈ రోజు చేసిన పని, ధాన ధర్మాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు విలువైన వస్తువులను కొనుగోలు చేసి, చాలా వస్తువులను దానం చేస్తారు. ముఖ్యంగా బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటారు. అక్షయ తృతీయను జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. మరి నేడు బంగారం కొనడానికి శుభ సమయం ఎప్పుడుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:Anakapalle: పెళ్లై ఏడాది గడవక ముందే ఘోరం.. అసలు ఏమైందంటే?
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
హిందూ క్యాలెండర్ ప్రకారం.. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి ఏప్రిల్ 29న అంటే ఈరోజు సాయంత్రం 5:31 గంటలకు ప్రారంభమైంది. ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, అక్షయ తృతీయను ఏప్రిల్ 30 బుధవారం జరుపుకుంటారు. పూజ చేయడానికి శుభ సమయం ఉదయం 5:41 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
Also Read:Allu Arjun : బన్నీ-అట్లీ మూవీ.. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తోందే..
బంగారం కొనడానికి అనుకూలమైన సమయం
ఏప్రిల్ 30న ఉదయం 5:41 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు బంగారం కొనడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. బంగారం కొనలేకపోతే బంగారం పూత పూసిన వస్తువులను కొనండి. ఈ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వీటిని కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇందులో ఇత్తడి పాత్రలు, అలాగే పసుపు ఆవాలు కొనడం కూడా చాలా శుభప్రదం. ఉదయం చల్లటి నీటితో స్నానం చేసి విష్ణువు, లక్ష్మీని పూజించాలి. తెల్లని పువ్వులు అర్పించి, విష్ణువు, లక్ష్మీ దేవి మంత్రాలను జపించాలి. తరువాత ఏదైనా దానం చేస్తే పుణ్యం వస్తుందంటున్నారు పండితులు.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!