Ajay Devgn : ఈ షేర్లో రూ. 2.74కోట్లు ఇన్వెస్ట్ చేసిన అజయ్ దేవగన్.. ఏడాదిలో ఎంత లాభమొచ్చిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Devgn : స్కామ్ సినిమా చూస్తే ఆ డైలాగ్ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఇందులో స్టాక్ మార్కెట్ ఒక లోతైన సముద్రం అని చెప్పబడింది. దీనికి పరిమితి లేదు. బహుశా అందుకే ప్రముఖ వ్యాపారులు, రిటైల్ పెట్టుబడిదారులతో పాటు, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇందులో డబ్బు పెట్టుబడి పెడతారు. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ ఒక పెన్నీ స్టాక్ ద్వారా భారీ ఆదాయాన్ని సంపాదించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన రూ.2.7 కోట్లను పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్మాల్క్యాప్ కంపెనీలో అజయ్ దేవగన్ లక్ష ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. విశేషమేమిటంటే ఈ కంపెనీ ఏడాదిలో 944శాతం భారీ రాబడిని ఇచ్చింది.
Read Also:Samantha : షికార్లు అయిపోయాయ్.. ఇక డివోషనల్ మోడ్ ఆన్!
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
చలనచిత్ర నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ వాటా సుమారు ఏడాది క్రితం అంటే మార్చి 6న రూ.94.60 మాత్రమే. ఇది ఇప్పుడు మార్చి 4 ఉదయం 11.26 గంటల సమయానికి రూ.988కి చేరుకుంది. అంటే సంవత్సరంలో 944 శాతం భారీ రాబడి ఇచ్చింది. ఒక సంవత్సరంలో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ అనతికాలంలోనే మల్టీబ్యాగర్గా మారింది. ఈ కంపెనీలో అజయ్ దేవగన్ పెట్టుబడి పెట్టినప్పుడు ఒక్కో షేరుకు రూ.274 చొప్పున లక్ష ఈక్విటీ షేర్లు కొనుగోలు చేశాడు. స్మాల్ క్యాప్ నుంచి మల్టీబ్యాగర్గా మారిన ఈ కంపెనీలో అజయ్ దేవగన్తో పాటు మరో తొమ్మిది మంది పెట్టుబడులు పెట్టారు. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. అజయ్ దేవగన్ ఈ కంపెనీలో రూ. 2.74 కోట్లు పెట్టుబడి పెట్టారు. అతను ఈ కంపెనీకి చెందిన 1 లక్ష ఈక్విటీ షేర్లను పొందాడు. 274 చొప్పున అజయ్ దేవగన్ ఈ షేర్లను పొందారు. 1980లో ప్రారంభమైన ఈ కంపెనీ పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది.
Read Also:Nita Ambani : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..
5 సంవత్సరాలలో 7000శాతం రాబడి
అజయ్ దేవగన్ మాత్రమే కాదు. ఏడాది క్రితం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఎవరికైనా 944 శాతం భారీ రాబడి వచ్చేంది. ఇది ఒక్క ఏడాది మాత్రమే. ఐదేళ్ల రాబడుల గురించి మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ఈ కంపెనీ పెట్టుబడిదారులకు 7000 శాతం రాబడిని అందించింది. ఐదేళ్ల క్రితం ఈ షేరు ధర రూ.13.84 మాత్రమే కాగా, ఇప్పుడు దాదాపు రూ.988కి పెరిగింది.
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!