Ajay Devgn : ఈ షేర్లో రూ. 2.74కోట్లు ఇన్వెస్ట్ చేసిన అజయ్ దేవగన్.. ఏడాదిలో ఎంత లాభమొచ్చిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Devgn : స్కామ్ సినిమా చూస్తే ఆ డైలాగ్ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఇందులో స్టాక్ మార్కెట్ ఒక లోతైన సముద్రం అని చెప్పబడింది. దీనికి పరిమితి లేదు. బహుశా అందుకే ప్రముఖ వ్యాపారులు, రిటైల్ పెట్టుబడిదారులతో పాటు, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇందులో డబ్బు పెట్టుబడి పెడతారు. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ ఒక పెన్నీ స్టాక్ ద్వారా భారీ ఆదాయాన్ని సంపాదించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన రూ.2.7 కోట్లను పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్మాల్క్యాప్ కంపెనీలో అజయ్ దేవగన్ లక్ష ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. విశేషమేమిటంటే ఈ కంపెనీ ఏడాదిలో 944శాతం భారీ రాబడిని ఇచ్చింది.
Read Also:Samantha : షికార్లు అయిపోయాయ్.. ఇక డివోషనల్ మోడ్ ఆన్!
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
చలనచిత్ర నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ వాటా సుమారు ఏడాది క్రితం అంటే మార్చి 6న రూ.94.60 మాత్రమే. ఇది ఇప్పుడు మార్చి 4 ఉదయం 11.26 గంటల సమయానికి రూ.988కి చేరుకుంది. అంటే సంవత్సరంలో 944 శాతం భారీ రాబడి ఇచ్చింది. ఒక సంవత్సరంలో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ అనతికాలంలోనే మల్టీబ్యాగర్గా మారింది. ఈ కంపెనీలో అజయ్ దేవగన్ పెట్టుబడి పెట్టినప్పుడు ఒక్కో షేరుకు రూ.274 చొప్పున లక్ష ఈక్విటీ షేర్లు కొనుగోలు చేశాడు. స్మాల్ క్యాప్ నుంచి మల్టీబ్యాగర్గా మారిన ఈ కంపెనీలో అజయ్ దేవగన్తో పాటు మరో తొమ్మిది మంది పెట్టుబడులు పెట్టారు. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. అజయ్ దేవగన్ ఈ కంపెనీలో రూ. 2.74 కోట్లు పెట్టుబడి పెట్టారు. అతను ఈ కంపెనీకి చెందిన 1 లక్ష ఈక్విటీ షేర్లను పొందాడు. 274 చొప్పున అజయ్ దేవగన్ ఈ షేర్లను పొందారు. 1980లో ప్రారంభమైన ఈ కంపెనీ పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది.
Read Also:Nita Ambani : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..
5 సంవత్సరాలలో 7000శాతం రాబడి
అజయ్ దేవగన్ మాత్రమే కాదు. ఏడాది క్రితం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఎవరికైనా 944 శాతం భారీ రాబడి వచ్చేంది. ఇది ఒక్క ఏడాది మాత్రమే. ఐదేళ్ల రాబడుల గురించి మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ఈ కంపెనీ పెట్టుబడిదారులకు 7000 శాతం రాబడిని అందించింది. ఐదేళ్ల క్రితం ఈ షేరు ధర రూ.13.84 మాత్రమే కాగా, ఇప్పుడు దాదాపు రూ.988కి పెరిగింది.
తాజావార్తలు
-
Kiara Advani: ప్రతి రిలేషన్ మనకు.. ఏదో ఒక పాఠం నేర్పుతుంది..
-
Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!