Air India Express : ఈ మూడు నగరాల నుండి అయోధ్యకు డైరెక్ట్ విమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Express : అయోధ్యకు శనివారం అనగా డిసెంబర్ 30 చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో నిర్మించిన కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్ను మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభించనున్నారు. అయోధ్యలోని ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ గా నామకరణం చేశారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డిసెంబర్ 29, శుక్రవారం దేశంలోని మూడు నగరాల నుండి అయోధ్యకు నేరుగా విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 17, 2024 నుండి బెంగళూరు- కోల్కతా మధ్య అయోధ్యకు నేరుగా విమానాలు నడపనున్నట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. ఇది కాకుండా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ జనవరి 30 నుండి ఢిల్లీ – అయోధ్య మధ్య డైరెక్ట్ విమానాలను నడపనుంది.
బెంగళూరు – అయోధ్య మధ్య ఫ్లైట్ టైమ్ గురించి చెప్పుకుంటే.. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ జనవరి 17 న ఉదయం 8.05 గంటలకు మొదటి విమానం నడుస్తుంది. ఇది ఉదయం 10.35 గంటలకు అయోధ్యకు చేరుకుంటుందని తెలిపింది. అయితే విమానం అయోధ్య నుంచి రోజుకు 3.40 నిమిషాలకు బయలుదేరి 6.10 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది. అయోధ్య నుంచి తొలి విమానం జనవరి 17న ఉదయం 11.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కోల్కతా చేరుకుంటుంది. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కోల్కతా నుండి రోజూ 1.25 నిమిషాలకు బయలుదేరుతుంది.. 3.10 నిమిషాలకు అయోధ్య చేరుకుంటుంది.
Also Read
- OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్తో రచ్చ!
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Off The Record: నెల్లూరు టీడీపీ పాత నేతలకు షాకుల మీద షాకులు
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
Read Also:TS 6 Guarantees: ప్రజాపాలనకు పోటెత్తిన దరఖాస్తులు.. రెండోరోజుల్లో 8.12 లక్షలు
ఫ్లైట్ బుకింగ్ ప్రారంభం
ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ మాట్లాడుతూ – దేశంలోని ప్రతి ప్రాంతానికి విమాన సేవలను అందించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. ఇందుకోసం పగలు, రాత్రి నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. అయోధ్యకు విమానాల డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని, దేశంలోని మూడు ప్రధాన నగరాలు అంటే ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు నుండి నేరుగా విమానాలను నడపాలని నిర్ణయించుకున్నామన్నారు.
ఇండిగో ఇప్పటికే ప్రకటించింది
ఈరోజు డిసెంబర్ 30న ప్రధాని మోడీ అయోధ్య విమానాశ్రయాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఇండిగో తొలి విమానం టేకాఫ్ కానుంది. అయితే, వాణిజ్య విమాన కార్యకలాపాలు జనవరి 6, 2024 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. ఇండిగో జనవరి 11, 2024 నుండి అహ్మదాబాద్ – అయోధ్య మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది.
Read Also:Nitish Kumar : ఎన్టీయే నుంచి వైదొలగనున్న నితీశ్ కుమార్.. ప్రధాని అభ్యర్థి ఆయనే ?
తాజావార్తలు
-
OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్తో రచ్చ!
-
Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
-
Off The Record: నెల్లూరు టీడీపీ పాత నేతలకు షాకుల మీద షాకులు
-
Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
-
Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!