Air India Express : ఈ మూడు నగరాల నుండి అయోధ్యకు డైరెక్ట్ విమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Express : అయోధ్యకు శనివారం అనగా డిసెంబర్ 30 చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో నిర్మించిన కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్ను మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభించనున్నారు. అయోధ్యలోని ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ గా నామకరణం చేశారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డిసెంబర్ 29, శుక్రవారం దేశంలోని మూడు నగరాల నుండి అయోధ్యకు నేరుగా విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 17, 2024 నుండి బెంగళూరు- కోల్కతా మధ్య అయోధ్యకు నేరుగా విమానాలు నడపనున్నట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. ఇది కాకుండా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ జనవరి 30 నుండి ఢిల్లీ – అయోధ్య మధ్య డైరెక్ట్ విమానాలను నడపనుంది.
బెంగళూరు – అయోధ్య మధ్య ఫ్లైట్ టైమ్ గురించి చెప్పుకుంటే.. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ జనవరి 17 న ఉదయం 8.05 గంటలకు మొదటి విమానం నడుస్తుంది. ఇది ఉదయం 10.35 గంటలకు అయోధ్యకు చేరుకుంటుందని తెలిపింది. అయితే విమానం అయోధ్య నుంచి రోజుకు 3.40 నిమిషాలకు బయలుదేరి 6.10 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది. అయోధ్య నుంచి తొలి విమానం జనవరి 17న ఉదయం 11.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కోల్కతా చేరుకుంటుంది. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కోల్కతా నుండి రోజూ 1.25 నిమిషాలకు బయలుదేరుతుంది.. 3.10 నిమిషాలకు అయోధ్య చేరుకుంటుంది.
Also Read
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
Read Also:TS 6 Guarantees: ప్రజాపాలనకు పోటెత్తిన దరఖాస్తులు.. రెండోరోజుల్లో 8.12 లక్షలు
ఫ్లైట్ బుకింగ్ ప్రారంభం
ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ మాట్లాడుతూ – దేశంలోని ప్రతి ప్రాంతానికి విమాన సేవలను అందించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. ఇందుకోసం పగలు, రాత్రి నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. అయోధ్యకు విమానాల డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని, దేశంలోని మూడు ప్రధాన నగరాలు అంటే ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు నుండి నేరుగా విమానాలను నడపాలని నిర్ణయించుకున్నామన్నారు.
ఇండిగో ఇప్పటికే ప్రకటించింది
ఈరోజు డిసెంబర్ 30న ప్రధాని మోడీ అయోధ్య విమానాశ్రయాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఇండిగో తొలి విమానం టేకాఫ్ కానుంది. అయితే, వాణిజ్య విమాన కార్యకలాపాలు జనవరి 6, 2024 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. ఇండిగో జనవరి 11, 2024 నుండి అహ్మదాబాద్ – అయోధ్య మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది.
Read Also:Nitish Kumar : ఎన్టీయే నుంచి వైదొలగనున్న నితీశ్ కుమార్.. ప్రధాని అభ్యర్థి ఆయనే ?
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!