Site icon NTV Telugu

Air China: విమానం గాల్లో ఉండగానే చెలరేగిన మంటలు.. వణికిపోయిన ప్రయాణికులు

Air China

Air China

విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విమానాలు ప్రమాదభారిన పడుతున్నాయి. తాజాగా చైనాలో విమాన ప్రమాదం ప్రయాణికులను వణికించింది. విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. హ్యాన్జూ నుంచి సియోల్ వెళ్తుండగా ఎయిర్ చైనా విమానం (CA139)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్ క్యాబిన్ బ్యాగులో ఉన్న లిథియం బ్యాటరీ పేలి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన పైలట్స్ విమానాన్ని వెంటనే షాంఘైలోని పుడాంగ్ ఎయిర్ పోర్టుకు మళ్లించి సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version