PM Kisan Payment Date 2026: రైతన్నలకు శుభవార్త.. PM కిసాన్ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడుతాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan Payment Date 2026: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరిన లక్షలాది మంది రైతులు ఇప్పుడు 22వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర విడుదల చేసే డబ్బులు ఎప్పుడు తమ ఖాతాలో పడుతాయని రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం హోలీకి ముందు రైతుల ఖాతాలకు రూ.2 వేలు బదిలీ చేయవచ్చని అంటున్నారు. ఈ విడత ఫిబ్రవరి 2026 మొదటి లేదా రెండవ వారంలో విడుదల కావచ్చని చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 11, 2026న రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని సమాచారం. అయితే కేంద్రం ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే అధికారిక తేదీని విడుదల చేయలేదు.
READ ALSO: T20 World Cup: యూ-టర్న్ డ్రామా.. పాకిస్తాన్ను ఐసీసీ ఎలా దారికి తెచ్చింది..?
Also Read
- White House shooting: వాషింగ్టన్లో కలకలం.. వైట్ హౌస్ సమీపంలో షూటౌట్
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏటా రూ.6,000 ఇస్తుంది. ఈ మొత్తాన్ని కేంద్రం ఒకేసారి చెల్లించదు. కానీ ఒక్కో దఫాలో రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా చెల్లిస్తుంది. ఈ డబ్బును DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు. ఈ పథకం రైతులు తమ వ్యవసాయ ఖర్చులు, గృహ అవసరాలను సులభంగా తీర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి రైతు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందరు.
ప్రభుత్వం కొంతమంది రైతులను ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఒక రైతు ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేస్తే, వారికి పీఎం కిసాన్ డబ్బులు చెల్లించక పోవచ్చు. అలాగే భార్యాభర్తలిద్దరూ లేదా ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సభ్యులకు PM కిసాన్ ప్రయోజనాలను పొందుతుంటే వారికి చెల్లింపులు ఆలస్యం కావచ్చు. అటువంటి సందర్భాలలో ప్రభుత్వం భౌతిక ధృవీకరణను నిర్వహిస్తుంది. ఈ ధృవీకరణ పూర్తయ్యే వరకు, పీఎం కిసాన్ ప్రయోజనాలు తాత్కాలికంగా నిలిపి వేస్తారు. కొన్నిసార్లు, ఆధార్, బ్యాంక్ ఖాతా లేదా భూమికి సంబంధించిన సమాచారంలో వ్యత్యాసాల కారణంగా చెల్లింపులు ఆగిపోతాయి.
రైతులు కేంద్రం మంజూరు చేస్తున్న PM కిసాన్ ప్రయోజనాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అధికారిక PM కిసాన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. అందులో చెక్ చేసుకోవచ్చు. లేదంటే రైతులు తమ వాయిదా ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకోడానికి, అది ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి eMitra చాట్బాట్ను కూడా ఉపయోగించవచ్చు. PM-KISAN పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు. దీని ప్రాథమిక లక్ష్యం చిన్న, సన్నకారు రైతులకు అప్పులు చేయకుండా వారి వ్యవసాయ ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, గృహ అవసరాలను తీర్చగలిగేలా ఆర్థిక సహాయం అందించడం.
తాజావార్తలు
-
Shreyas Iyer: 146 మ్యాచ్ల తర్వాత శ్రేయస్ తొలి ఐపీఎల్ సెంచరీ.. ఛేజింగ్ చేస్తూ అరుదైన ఘనత
-
White House shooting: వాషింగ్టన్లో కలకలం.. వైట్ హౌస్ సమీపంలో షూటౌట్
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?