Armed Vigilante Groups: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ గ్రామస్థుల చేతికి ఆయుధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Armed Vigilante Groups: జమ్మూలోని రౌజౌరీలో హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటం, ఇళ్లలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతాపరంగా ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారీగా పారామిలిటరీ బలగాలను మోహరిస్తుండగా.. తాజాగా గ్రామ పరిరక్షణ బలగాలను పునరుద్ధరిస్తోంది. వారికి ప్రభుత్వమే ఆయుధాలు అందించి గ్రామాల్లో నిఘా వేసేందుకు ప్రోత్సహిస్తోంది. జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో పూర్వపు గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ దూకుడుగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటికే 5,000 మంది సాయుధ సభ్యులు ఉండగా, మరింత మంది గ్రామస్తులు పోలీసుల నుంచి ఆయుధాలు పొందేందుకు నమోదు చేసుకుంటున్నారు.
గ్రామ రక్షణ కమిటీలు విలేజ్ ఢిఫెన్స్ గ్రూప్స్ లేదా వీడీజీలుగా పేరు మార్చబడ్డాయి. రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున పునరుద్ధరించబడుతున్నాయి. ప్రతి సభ్యుడు 303 రైఫిల్, 100 రౌండ్ల మందుగుండు సామగ్రిని కలిగి ఉంటారు. వీరికి ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను కూడా సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతల యంత్రాంగం కుప్పకూలినప్పుడు కమిటీలు ఏర్పాటయ్యాయి. అయితే, సాధారణ ప్రజలను రక్షించే బాధ్యతను విస్మరించి, అటువంటి బృందాలకు ఆయుధాలు అందించిన ప్రభుత్వంపై విమర్శలు ఎదురయ్యాయి. చివరకు, భద్రతా దళాలు మైదానంలో తిరిగి నియంత్రణ సాధించడంతో ఈ కమిటీల పాత్ర తగ్గిపోయింది.
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
Woman Strangled Infant: తల్లి కాదు రాక్షసి.. 3 రోజుల పసికందును..
రాజౌరిలోని డాంగ్రీ గ్రామంలో ఇటీవల కొంతమంది హిందువులపై, మైనారిటీ కమ్యూనిటీపైరాజౌరిలోని డాంగ్రీ గ్రామంలో జరిగిన తీవ్రవాద దాడి తర్వాత వారు మళ్లీ పునరుద్ధరించబడ్డారు. రాజౌరిలోని పంచాయతీ కేంద్రాల వద్ద పోలీసులు ఆయుధాలను తనిఖీ చేయడంతోపాటు శిక్షణకు సంబంధించిన అవసరాలను గమనిస్తున్నారు. చాలా కాలం క్రితం వారి తల్లిదండ్రులకు, ఇతర బంధువులకు ఇచ్చిన ఆయుధాలను యువకులు స్వాధీనం చేసుకుంటున్నారు.
పూంచ్లోని నియంత్రణ రేఖకు సమీపంలోని మంగ్నార్ గ్రామం వద్ద పెట్రోలింగ్లో ఉన్న గ్రూప్ సభ్యుడు ఒకరు మీడియాతో మాట్లాడారు. “రైఫిల్ను శుభ్రం చేయడానికి నేను ఇక్కడకు వచ్చాను. అది సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయడానికి, మాపై దాడి జరిగితే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని యువకులలో ఒకరైన టింకూ రైనా అన్నారు. 20 ఏళ్ల అతను ఇంకా పోలీసు రికార్డులలో ఒక సమూహంలో నమోదు చేయలేదని చెప్పాడు, అయితే .303 రైఫిల్ తన మామకు కేటాయించబడింది.
తాజావార్తలు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!