Armed Vigilante Groups: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ గ్రామస్థుల చేతికి ఆయుధాలు
Armed Vigilante Groups: జమ్మూలోని రౌజౌరీలో హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటం, ఇళ్లలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతాపరంగా ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారీగా పారామిలిటరీ బలగాలను మోహరిస్తుండగా.. తాజాగా గ్రామ పరిరక్షణ బలగాలను పునరుద్ధరిస్తోంది. వారికి ప్రభుత్వమే ఆయుధాలు అందించి గ్రామాల్లో నిఘా వేసేందుకు ప్రోత్సహిస్తోంది. జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో పూర్వపు గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ దూకుడుగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటికే 5,000 మంది సాయుధ సభ్యులు ఉండగా, మరింత మంది గ్రామస్తులు పోలీసుల నుంచి ఆయుధాలు పొందేందుకు నమోదు చేసుకుంటున్నారు.
గ్రామ రక్షణ కమిటీలు విలేజ్ ఢిఫెన్స్ గ్రూప్స్ లేదా వీడీజీలుగా పేరు మార్చబడ్డాయి. రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున పునరుద్ధరించబడుతున్నాయి. ప్రతి సభ్యుడు 303 రైఫిల్, 100 రౌండ్ల మందుగుండు సామగ్రిని కలిగి ఉంటారు. వీరికి ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను కూడా సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతల యంత్రాంగం కుప్పకూలినప్పుడు కమిటీలు ఏర్పాటయ్యాయి. అయితే, సాధారణ ప్రజలను రక్షించే బాధ్యతను విస్మరించి, అటువంటి బృందాలకు ఆయుధాలు అందించిన ప్రభుత్వంపై విమర్శలు ఎదురయ్యాయి. చివరకు, భద్రతా దళాలు మైదానంలో తిరిగి నియంత్రణ సాధించడంతో ఈ కమిటీల పాత్ర తగ్గిపోయింది.
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
Woman Strangled Infant: తల్లి కాదు రాక్షసి.. 3 రోజుల పసికందును..
రాజౌరిలోని డాంగ్రీ గ్రామంలో ఇటీవల కొంతమంది హిందువులపై, మైనారిటీ కమ్యూనిటీపైరాజౌరిలోని డాంగ్రీ గ్రామంలో జరిగిన తీవ్రవాద దాడి తర్వాత వారు మళ్లీ పునరుద్ధరించబడ్డారు. రాజౌరిలోని పంచాయతీ కేంద్రాల వద్ద పోలీసులు ఆయుధాలను తనిఖీ చేయడంతోపాటు శిక్షణకు సంబంధించిన అవసరాలను గమనిస్తున్నారు. చాలా కాలం క్రితం వారి తల్లిదండ్రులకు, ఇతర బంధువులకు ఇచ్చిన ఆయుధాలను యువకులు స్వాధీనం చేసుకుంటున్నారు.
పూంచ్లోని నియంత్రణ రేఖకు సమీపంలోని మంగ్నార్ గ్రామం వద్ద పెట్రోలింగ్లో ఉన్న గ్రూప్ సభ్యుడు ఒకరు మీడియాతో మాట్లాడారు. “రైఫిల్ను శుభ్రం చేయడానికి నేను ఇక్కడకు వచ్చాను. అది సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయడానికి, మాపై దాడి జరిగితే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని యువకులలో ఒకరైన టింకూ రైనా అన్నారు. 20 ఏళ్ల అతను ఇంకా పోలీసు రికార్డులలో ఒక సమూహంలో నమోదు చేయలేదని చెప్పాడు, అయితే .303 రైఫిల్ తన మామకు కేటాయించబడింది.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!