Afganistan : కాబూల్ లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి..14మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afganistan : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్లోని పశ్చిమ ప్రాంతంలోని దష్ట్-ఎ-బర్చి ప్రాంతంలో బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఇద్దరు మరణించగా మరో 14మంది గాయపడ్డారు. పేలుడు ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు గురించి కాబూల్ పోలీసు అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ ది ఖొరాసన్ డైరీకి ధృవీకరించారు. పేలుడు జరిగిన సమయంలో బస్సులో చాలా మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి తాలిబాన్ యంత్రాంగం ఏమీ చెప్పలేదు.
Read Also:Guntur Kaaram : గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..వేదిక ఎక్కడంటే..?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
కోస్టర్ మోడల్గా గుర్తించబడిన బస్సు పేలుడు జరిగిన సమయంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంది. అయితే ఈ దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత తీసుకోలేదు. గత వారం ప్రారంభంలో కాబూల్లో మీడియాతో తాలిబాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకోబ్ ముజాహిద్ గత సంవత్సరం ఐఎస్-సంబంధిత దాడులలో 90 శాతం క్షీణత ఉందని పేర్కొన్నారు. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మిత్రదేశమైన తాలిబాన్కు ఐఎస్ కీలక ప్రత్యర్థి.
Read Also:Singareni CMD Balaram : దేశవ్యాప్తంగా సింగరేణి సోలార్
హిజాబ్ సరిగ్గా ధరించనందుకు కాబూల్లో చాలా మంది మహిళలను తాలిబాన్ అరెస్టు చేశారు. ఈ విషయంపై ప్రవర్తనా మంత్రిత్వ శాఖ ప్రతినిధి గురువారం రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చారు. తాలిబన్ పాలనా యంత్రాంగం జారీ చేసిన డ్రెస్ కోడ్ను పాటించనందుకు మహిళలపై తీసుకున్న చర్య మొదటిసారిగా ధృవీకరించబడింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే, ఈ కేసులో ఎంత మంది మహిళలను అరెస్టు చేశారన్న విషయాన్ని ప్రవర్తనా మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ గఫార్ ఫరూక్ వెల్లడించలేదు. ఈ మహిళలను 3 రోజుల క్రితం అరెస్టు చేశారు. హిజాబ్ సరిగ్గా ధరించకపోవడం అంటే ఏమిటో కూడా వివరించలేదు. రెండు సంవత్సరాల క్రితం మే 2, 2022 న, తాలిబాన్ మహిళలు తల నుంచి కాళ్ల వరకు బురఖా ధరించాలని.. తమ కళ్ళు మాత్రమే చూపించాలని ఒక డిక్రీని జారీ చేసింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..