Adipurush : టికెట్స్ ధర ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న మేకర్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఎంతో గ్రాండ్ గా విడుదలైంది ఆదిపురుష్ సినిమా.సినిమా పై మొదటి నుంచి నెగటివ్ టాక్ రావడంతో సినిమాకు ఆశించన ఫలితం రాలేదు.. సినిమా పై వరుసగా వస్తున్న విమర్శలు వల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది.రోజురోజుకూ కలెక్షన్లు దారుణంగా పడిపోతుండటంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.ఆదిపురుష్ సినిమా విడుదలైన మొదటి మూడ్రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభావంతో సుమారు 250 కోట్ల వరకూ బిజినెస్ చేసి భారీ రికార్డు సృష్టించింది. ఈ రేంజ్ లోనే కలెక్షన్స్ వస్తాయని అందరూ కూడా ఆశించారు. అయితే విడుదలైన నాలుగవరోజు నుంచి రోజురోజుకూ కలెక్షన్లు దారుణంగా పడిపోతూ వచ్చాయి. ఎంతలా అంటే ఇప్పటి వరకూ ఈ సినిమా కేవలం 363 కోట్లే గ్రాస్ కలెక్షన్లు మాత్రమే చేయగలిగింది.ఆదిపురుష్ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం సాధించలేకపోయింది. సినిమా విడుదలైన నాలుగోరోజు నుంచే కలెక్షన్లు గణనీయంగా తగ్గిపోవడం జరిగింది.. మొదటి రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 32 కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమా 7వ రోజుకు 97 లక్షల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది.. ఇక 8వ రోజుకు అయితే కేవలం 65 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 363 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి..
దాంతో ఆదిపురుష్ సినిమా టికెట్లను ధర ను తగ్గిస్తూ చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం జరిగింది.రేపట్నించి 3డిలో ఈ సినిమాను కేవలం 112 రూపాయలకే చూడవచ్చని టీ సిరీస్ ప్రకటించింది. సినిమాలోని డైలాగ్స్పై అభ్యంతరాలు కూడా రావడంతో వాటిని కూడా మార్చినట్టు కూడా టీ సిరీస్ వెల్లడించింది. మార్పులు చేసిన డైలాగ్స్ రేపటి నుండి ప్రదర్శిస్తామని తెలిపింది.ప్రభాస్ కెరీర్ లో రాధేశ్యామ్ తరువాత వచ్చిన ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోకపోవడం తో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ లో ఉన్నారు. ప్రభాస్ అభిమానులు ఆయన తరువాత సినిమా సలార్పైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు.
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!